Political News

నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో గత 685 రోజులుగా రైతులు, మహిళలు, యువత ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా దాదాపు 45 రోజులు సాగే ఈ యాత్ర నవంబరు 1న తుళ్లూరులో మొదలై డిసెంబరు 19న తిరుపతిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల మహాపాద యాత్రకు వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలిపాయి. ఈ మహా పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం ప్రకటిస్తూ ఉద్యమకారులకు ధైర్యం చెప్పారు.

ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని లోకేష్ ఆంకాంక్షించారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ అన్నారు. ఉద్యమకారులకు టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ అన్నారు.

మరోవైపు, ఈ పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా…ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండడం సిగ్గుచేటన్నారు. ఇక, మహా పాదయాత్ర విజయవంతం కావాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆకాంక్షించారు.

అంతకుముందు, రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు ఏపీ డీజీసీ గౌతమ్ సవాంగ్ అనుమతి నిరాకరించారు. దీంతో, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, యాత్ర సందర్భంగా సవాంగ్ పలు ఆంక్షలు విధించారు. ముందుగా సమర్పించిన జాబితాలో ఉన్న 157 మందికి మాత్రమే యాత్రలో అనుమతినిచ్చారు. డీజేలు, భారీ స్పీకర్లు, బహిరంగ సభలు పెట్టకూడదని అన్నారు.

This post was last modified on November 1, 2021 2:44 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago