Political News

నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో గత 685 రోజులుగా రైతులు, మహిళలు, యువత ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా దాదాపు 45 రోజులు సాగే ఈ యాత్ర నవంబరు 1న తుళ్లూరులో మొదలై డిసెంబరు 19న తిరుపతిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల మహాపాద యాత్రకు వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలిపాయి. ఈ మహా పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం ప్రకటిస్తూ ఉద్యమకారులకు ధైర్యం చెప్పారు.

ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని లోకేష్ ఆంకాంక్షించారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ అన్నారు. ఉద్యమకారులకు టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ అన్నారు.

మరోవైపు, ఈ పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా…ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండడం సిగ్గుచేటన్నారు. ఇక, మహా పాదయాత్ర విజయవంతం కావాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆకాంక్షించారు.

అంతకుముందు, రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు ఏపీ డీజీసీ గౌతమ్ సవాంగ్ అనుమతి నిరాకరించారు. దీంతో, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, యాత్ర సందర్భంగా సవాంగ్ పలు ఆంక్షలు విధించారు. ముందుగా సమర్పించిన జాబితాలో ఉన్న 157 మందికి మాత్రమే యాత్రలో అనుమతినిచ్చారు. డీజేలు, భారీ స్పీకర్లు, బహిరంగ సభలు పెట్టకూడదని అన్నారు.

This post was last modified on November 1, 2021 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

8 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago