Political News

నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో గత 685 రోజులుగా రైతులు, మహిళలు, యువత ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా దాదాపు 45 రోజులు సాగే ఈ యాత్ర నవంబరు 1న తుళ్లూరులో మొదలై డిసెంబరు 19న తిరుపతిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల మహాపాద యాత్రకు వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలిపాయి. ఈ మహా పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం ప్రకటిస్తూ ఉద్యమకారులకు ధైర్యం చెప్పారు.

ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని లోకేష్ ఆంకాంక్షించారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ అన్నారు. ఉద్యమకారులకు టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ అన్నారు.

మరోవైపు, ఈ పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా…ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండడం సిగ్గుచేటన్నారు. ఇక, మహా పాదయాత్ర విజయవంతం కావాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆకాంక్షించారు.

అంతకుముందు, రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు ఏపీ డీజీసీ గౌతమ్ సవాంగ్ అనుమతి నిరాకరించారు. దీంతో, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, యాత్ర సందర్భంగా సవాంగ్ పలు ఆంక్షలు విధించారు. ముందుగా సమర్పించిన జాబితాలో ఉన్న 157 మందికి మాత్రమే యాత్రలో అనుమతినిచ్చారు. డీజేలు, భారీ స్పీకర్లు, బహిరంగ సభలు పెట్టకూడదని అన్నారు.

This post was last modified on November 1, 2021 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago