కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కు బీజేపీ గాలమేస్తోంది. వచ్చే ఏడాదిలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ఆజాద్ ను పోటీచేయించే అవకాశాన్ని నరేంద్రమోడి పరిశీలిస్తున్నారట. కాంగ్రెస్ నేతను ఏమిటి ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా పోటీచేయించటం ఏమిటి అనే సందేహాలు రావచ్చు. కానీ ఆజాద్ అభ్యర్ధిత్వం పరిశీలన విషయంలో మోడికి హిడెన్ అజెండా ఉందని అర్ధమైపోతోంది.
మొదటిదేమో ఆజాద్ ముస్లిం మైనారిటీలకు చెందిన కీలకనేత. రెండో పాయింట్ ఆజాద్ కు జాతీయస్ధాయిలోని వివిధ పార్టీల అధినేతల్లో చాలామందితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మూడోది కీలకమైన జమ్మూ-కాశ్మీర్ కు చెందిన నేత. ఆజాద్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేస్తే పార్టీల రహితంగా మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. అలాగే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల్లో ఆజాద్ సేవలను బీజేపీకి అనుకూలంగా ఉపయోగించుకోవాలని మోడి ప్లాన్ చేస్తున్నారు.
ఫైనల్ పాయింట్ ఏమిటంటే దేశంలోని వివిధ పార్టీల ఎంపీల మద్దతును ఆజాద్ వ్యక్తిగతంగా సంపాదించుకోగలరని మోడి అంచనా వేస్తున్నారు. ఆజాద్ వ్యక్తిగత పలుకుబడికి ఎన్డీయే ఎంపీల మద్దతు కూడా తోడైతే సులభంగా గెలవచ్చని మోడి అనుకుంటున్నారు. హోలు మొత్తంమీద చూస్తే కాశ్మీర్ ఎన్నిక ముందు బలమైన నేత ఆజాద్ ను కాంగ్రెస్ కు దూరం చేయాలనే ప్లాన్ కూడా ఉన్నట్లు అర్ధమైపోతోంది. వీటన్నింటినీ పక్కనపెట్టేస్తే ప్రతిపక్షాలకు చెందిన మంచి ట్రాక్ రికార్డున్న నేతను ఎన్డీయే ప్రభుత్వం ఉపరాష్ట్రపతిని చేసిందని పైకి చెప్పుకోవచ్చు.
మోడి అంతర్గత వ్యూహాలు అందరికీ తెలిసినా పైకి మాత్రం కాంగ్రెస్ నేతను ఎన్డీయే ఉపరాష్ట్రతిగా ఎంపిక చేసిందని చెప్పుకున్నపుడు ఎవరు కాదనేందుకు లేదు. నిజానికి ఆజాద్ ఇపుడు ఔట్ డేటెడ్ నేతయిపోయారనే చెప్పాలి. ఆయన పేరుకు జమ్మూకాశ్మీర్ నేతే అయినా ఏ రోజూ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉపయోగపడింది లేదు. పైగా కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆజాద్ పూర్తికాలం పదవిలో ఉండలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా కాంగ్రెస్ నేతకు మోడి గాలమేయటం కాస్త ఇంట్రస్టింగు గానే ఉంది.
This post was last modified on October 30, 2021 3:57 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…