Political News

ఏ గ్రౌండ్స్ లో పట్టాభికి హైకోర్టు మంజూరు చేసింది?

గడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయిన రాజకీయ రగడకు సెంటర్ గా మారారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేయటం.. తాజాగా ఆయన రాజమహేంద్రవరం జైలుకు తరలించటం తెలిసిందే. దీంతో.. పట్టాభికి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా పట్టాభి తరఫు లాయర్ కీలకమైన పాయింట్ ను తెర మీదకు తేవటంతో శుక్రవారం జరిగిన విచారణను శనివారానికి వాయిదా వేశారు. తాజాగా పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంతకూ పట్టాభికి అంత త్వరగా బెయిల్ ఎందుకు వచ్చింది?

దానికి కారణం ఏమిటి? అన్న విషయాల్ని చూస్తే.. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సందర్భంగా పోలీసులు కొన్ని చోట్ల ఖాళీలు ఉంచేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని సేకరించి అందులో నమోదు చేయాలని కింది కోర్టు పేర్కొంటూ.. ఆయన్ను రిమాండ్ కు ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై అప్పీలుకు వెళ్లిన పట్టాభి లాయర్.. ఇదే విషయాన్ని ప్రశ్నించటం.. సంశయాలు ఉన్నప్పుడు రిమాండ్ కు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించటం.. దానికి సంబంధించిన వివరాల్ని ఇవ్వాలని పీపీని ఆదేశించటం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో.. పట్టాభి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికి ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో ఉన్న ఖాళీల ఆధారంగానే బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. పట్టాభి కి బెయిల్ రావటంపై టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

This post was last modified on October 24, 2021 12:17 am

Share
Show comments
Published by
Satya
Tags: PattabhiTDP

Recent Posts

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

18 seconds ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

54 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

1 hour ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

2 hours ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

3 hours ago