గడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయిన రాజకీయ రగడకు సెంటర్ గా మారారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేయటం.. తాజాగా ఆయన రాజమహేంద్రవరం జైలుకు తరలించటం తెలిసిందే. దీంతో.. పట్టాభికి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా పట్టాభి తరఫు లాయర్ కీలకమైన పాయింట్ ను తెర మీదకు తేవటంతో శుక్రవారం జరిగిన విచారణను శనివారానికి వాయిదా వేశారు. తాజాగా పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంతకూ పట్టాభికి అంత త్వరగా బెయిల్ ఎందుకు వచ్చింది?
దానికి కారణం ఏమిటి? అన్న విషయాల్ని చూస్తే.. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సందర్భంగా పోలీసులు కొన్ని చోట్ల ఖాళీలు ఉంచేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని సేకరించి అందులో నమోదు చేయాలని కింది కోర్టు పేర్కొంటూ.. ఆయన్ను రిమాండ్ కు ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై అప్పీలుకు వెళ్లిన పట్టాభి లాయర్.. ఇదే విషయాన్ని ప్రశ్నించటం.. సంశయాలు ఉన్నప్పుడు రిమాండ్ కు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించటం.. దానికి సంబంధించిన వివరాల్ని ఇవ్వాలని పీపీని ఆదేశించటం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో.. పట్టాభి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికి ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో ఉన్న ఖాళీల ఆధారంగానే బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. పట్టాభి కి బెయిల్ రావటంపై టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
This post was last modified on October 24, 2021 12:17 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…