Political News

బాబు అంచ‌నాల‌ను మించిపోయిందిగా!

ఎటు చూసినా.. ప‌చ్చ‌జెండాలు. కాలు క‌దిపేందుకు వీలు లేనంత‌గా త‌మ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మ‌హి ళా నాయ‌కులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జ‌నం.. ఇదీ.. మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద .. తాజా ప‌రిస్థితి. చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష‌కు క‌నీ వినీ ఎరుగ‌ని స్పంద‌న ల‌భించింది. నిజానికి చంద్ర‌బాబు కూడా ఇంత రేంజ్‌లో స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని ఆరోపిస్తూ.. చంద్ర‌బాబు దీక్ష‌కు కూర్చున్న విష‌యం తెలిసిందే.

గురువారం ఉద‌యం 8గంట‌ల‌కు ప్రారంభ‌మైన దీక్ష‌కు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కీల‌క నేత‌లు చేరుకున్నా.. సాధార‌ణ ప్ర‌జ‌లు, దిగువ శ్రేణి నాయ‌కులు మాత్రం చేరుకోలేదు. దీంతో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు అనుకున్న‌మేర‌కు హ‌డావుడి క‌నిపించ‌లేదు. దీంతో వైసీపీ మంత్రులు కొందరు ఈ ప‌రిణామాల‌ను ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ఒక్క‌రే దీక్ష‌లో కూర్చున్నార‌ని.. ఆయ‌న కు పెద్ద‌గా స్పంద‌న రాలేద‌ని.. అన్నారు. అయితే.. వాస్తవానికి అప్ప‌టికే జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు క‌దిలాయి. మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి.. చేరుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా మంది నిన్న సాయంత్రం వ‌ర‌కు చేరుకోలేక పోయారు.

వీరిలో మాజీ మంత్రి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా ఉన్నారు. ఇక‌, ఇదే విష‌యం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకుంటున్నార‌న‌ని.. నిర‌స‌న తెలిపే హ‌క్కుపై ఉక్కుపాదం మోపుతున్నార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. దీంతో పోలీసులు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించి..పార్టీ నేత‌లు వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, అప్ప‌టి నుంచి అన్ని దారులు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యానికే దారితీశాయి. దీంతో రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యం నుంచి టీడీపీ కార్యాల‌యం కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాల‌యానికి ముందున్న జాతీయ ర‌హ‌దారి కూడా .. వాహ‌నాల‌తో నిండిపోయింది.

ప్ర‌స్తుతం టీడీపీ కార్యాల‌యంలో అడుగు పెట్టేందుకు చోటు లేనంత‌గా త‌మ్ముళ్లు చేరుకున్నారు. మ‌రోవై పు.. మ‌హిళానాయ‌కులు కూడా క్యూ క‌ట్టారు. ఎటు చూసినా.. ప‌సుపు జెండాలే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు దీక్ష‌కు అంద‌రూ సంఘీభావం ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. జిల్లాల్లోనూ నాయ‌కులు.. దీక్ష‌లు చేప‌ట్టారు. ఎక్క‌డిక‌క్క‌డ జిల్లా అధ్య‌క్షులు దీక్ష‌ల‌కు కూర్చున్నారు. ఇక‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు.. మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యానికి పెద్ద ఎత్తున వ‌చ్చారు. ఈ ప‌రిణామం.. చూసిన వారు.. చంద్ర‌బాబు ఊహించిన దానికంటే కూడా.. ఎక్కువ‌గా స్పంద‌న వ‌చ్చింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం దీక్ష‌కు వ‌చ్చిన జ‌నాల ఫొటోల‌తో సోష‌ల్ మీడియా నిండిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 22, 2021 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

2 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

2 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

8 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

10 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

10 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

11 hours ago