Political News

బాబు అంచ‌నాల‌ను మించిపోయిందిగా!

ఎటు చూసినా.. ప‌చ్చ‌జెండాలు. కాలు క‌దిపేందుకు వీలు లేనంత‌గా త‌మ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మ‌హి ళా నాయ‌కులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జ‌నం.. ఇదీ.. మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద .. తాజా ప‌రిస్థితి. చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష‌కు క‌నీ వినీ ఎరుగ‌ని స్పంద‌న ల‌భించింది. నిజానికి చంద్ర‌బాబు కూడా ఇంత రేంజ్‌లో స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని ఆరోపిస్తూ.. చంద్ర‌బాబు దీక్ష‌కు కూర్చున్న విష‌యం తెలిసిందే.

గురువారం ఉద‌యం 8గంట‌ల‌కు ప్రారంభ‌మైన దీక్ష‌కు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కీల‌క నేత‌లు చేరుకున్నా.. సాధార‌ణ ప్ర‌జ‌లు, దిగువ శ్రేణి నాయ‌కులు మాత్రం చేరుకోలేదు. దీంతో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు అనుకున్న‌మేర‌కు హ‌డావుడి క‌నిపించ‌లేదు. దీంతో వైసీపీ మంత్రులు కొందరు ఈ ప‌రిణామాల‌ను ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ఒక్క‌రే దీక్ష‌లో కూర్చున్నార‌ని.. ఆయ‌న కు పెద్ద‌గా స్పంద‌న రాలేద‌ని.. అన్నారు. అయితే.. వాస్తవానికి అప్ప‌టికే జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు క‌దిలాయి. మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి.. చేరుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా మంది నిన్న సాయంత్రం వ‌ర‌కు చేరుకోలేక పోయారు.

వీరిలో మాజీ మంత్రి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా ఉన్నారు. ఇక‌, ఇదే విష‌యం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకుంటున్నార‌న‌ని.. నిర‌స‌న తెలిపే హ‌క్కుపై ఉక్కుపాదం మోపుతున్నార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. దీంతో పోలీసులు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించి..పార్టీ నేత‌లు వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, అప్ప‌టి నుంచి అన్ని దారులు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యానికే దారితీశాయి. దీంతో రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యం నుంచి టీడీపీ కార్యాల‌యం కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాల‌యానికి ముందున్న జాతీయ ర‌హ‌దారి కూడా .. వాహ‌నాల‌తో నిండిపోయింది.

ప్ర‌స్తుతం టీడీపీ కార్యాల‌యంలో అడుగు పెట్టేందుకు చోటు లేనంత‌గా త‌మ్ముళ్లు చేరుకున్నారు. మ‌రోవై పు.. మ‌హిళానాయ‌కులు కూడా క్యూ క‌ట్టారు. ఎటు చూసినా.. ప‌సుపు జెండాలే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు దీక్ష‌కు అంద‌రూ సంఘీభావం ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. జిల్లాల్లోనూ నాయ‌కులు.. దీక్ష‌లు చేప‌ట్టారు. ఎక్క‌డిక‌క్క‌డ జిల్లా అధ్య‌క్షులు దీక్ష‌ల‌కు కూర్చున్నారు. ఇక‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు.. మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యానికి పెద్ద ఎత్తున వ‌చ్చారు. ఈ ప‌రిణామం.. చూసిన వారు.. చంద్ర‌బాబు ఊహించిన దానికంటే కూడా.. ఎక్కువ‌గా స్పంద‌న వ‌చ్చింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం దీక్ష‌కు వ‌చ్చిన జ‌నాల ఫొటోల‌తో సోష‌ల్ మీడియా నిండిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 22, 2021 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

39 minutes ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

2 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

5 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

6 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

9 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

9 hours ago