Political News

బాబు అంచ‌నాల‌ను మించిపోయిందిగా!

ఎటు చూసినా.. ప‌చ్చ‌జెండాలు. కాలు క‌దిపేందుకు వీలు లేనంత‌గా త‌మ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మ‌హి ళా నాయ‌కులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జ‌నం.. ఇదీ.. మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద .. తాజా ప‌రిస్థితి. చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష‌కు క‌నీ వినీ ఎరుగ‌ని స్పంద‌న ల‌భించింది. నిజానికి చంద్ర‌బాబు కూడా ఇంత రేంజ్‌లో స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని ఆరోపిస్తూ.. చంద్ర‌బాబు దీక్ష‌కు కూర్చున్న విష‌యం తెలిసిందే.

గురువారం ఉద‌యం 8గంట‌ల‌కు ప్రారంభ‌మైన దీక్ష‌కు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కీల‌క నేత‌లు చేరుకున్నా.. సాధార‌ణ ప్ర‌జ‌లు, దిగువ శ్రేణి నాయ‌కులు మాత్రం చేరుకోలేదు. దీంతో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు అనుకున్న‌మేర‌కు హ‌డావుడి క‌నిపించ‌లేదు. దీంతో వైసీపీ మంత్రులు కొందరు ఈ ప‌రిణామాల‌ను ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ఒక్క‌రే దీక్ష‌లో కూర్చున్నార‌ని.. ఆయ‌న కు పెద్ద‌గా స్పంద‌న రాలేద‌ని.. అన్నారు. అయితే.. వాస్తవానికి అప్ప‌టికే జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు క‌దిలాయి. మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి.. చేరుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా మంది నిన్న సాయంత్రం వ‌ర‌కు చేరుకోలేక పోయారు.

వీరిలో మాజీ మంత్రి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా ఉన్నారు. ఇక‌, ఇదే విష‌యం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకుంటున్నార‌న‌ని.. నిర‌స‌న తెలిపే హ‌క్కుపై ఉక్కుపాదం మోపుతున్నార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. దీంతో పోలీసులు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించి..పార్టీ నేత‌లు వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, అప్ప‌టి నుంచి అన్ని దారులు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యానికే దారితీశాయి. దీంతో రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యం నుంచి టీడీపీ కార్యాల‌యం కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాల‌యానికి ముందున్న జాతీయ ర‌హ‌దారి కూడా .. వాహ‌నాల‌తో నిండిపోయింది.

ప్ర‌స్తుతం టీడీపీ కార్యాల‌యంలో అడుగు పెట్టేందుకు చోటు లేనంత‌గా త‌మ్ముళ్లు చేరుకున్నారు. మ‌రోవై పు.. మ‌హిళానాయ‌కులు కూడా క్యూ క‌ట్టారు. ఎటు చూసినా.. ప‌సుపు జెండాలే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు దీక్ష‌కు అంద‌రూ సంఘీభావం ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. జిల్లాల్లోనూ నాయ‌కులు.. దీక్ష‌లు చేప‌ట్టారు. ఎక్క‌డిక‌క్క‌డ జిల్లా అధ్య‌క్షులు దీక్ష‌ల‌కు కూర్చున్నారు. ఇక‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు.. మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యానికి పెద్ద ఎత్తున వ‌చ్చారు. ఈ ప‌రిణామం.. చూసిన వారు.. చంద్ర‌బాబు ఊహించిన దానికంటే కూడా.. ఎక్కువ‌గా స్పంద‌న వ‌చ్చింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం దీక్ష‌కు వ‌చ్చిన జ‌నాల ఫొటోల‌తో సోష‌ల్ మీడియా నిండిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 22, 2021 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

2 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

3 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

4 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago