ఒకటి అని రెండు అనిపించుకోవడం.. అంటే ఇదే అంటున్నారు ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చూసిన.. నెటిజన్లు. తాజాగా ఆయన విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వరుసగా రెండోరోజూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను మరోసారి జగన్ గుర్తు చేశారు. అయితే.. ఈ సందర్భంగా.. ఆయన బోష్డీకే.. అనే మాటకు అర్ధం చెప్పారు. అది ఇదీ.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఒక కాన్ట్సిట్యూషన్ హెడ్నే ఇలా బోష్డీకే అంటూ.. మాట్లాడతారా? ఇంక, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇదేనా.. చంద్రబాబు తన పార్టీ నేతలకు నేర్పిస్తున్న మర్యాద?” అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే.. జగన్ చెప్పినట్టు రాజ్యాంగానికి హెడ్ అయినప్పుడు.. గతంలో జగన్ కూడా ఇలాంటి మాటలే అన్నారు కదా.. మరి అప్పట్లో .. కాన్ట్సిట్యూషన్ హెడ్ అన్న విషయం ఆయనకు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికలో జరిగిన ఘటను వారు గుర్తు చేస్తున్నారు.
2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి.. “ఈ ముఖ్యమంత్రిని బహిరంగంగా కాల్చిచంపినా తప్పులేదనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. మరి ఆనాడు.. సీఎంగా ఉన్న చంద్రబాబు కాన్ట్సిట్యూషన్ హెడ్ గా జగన్ అనుకోలేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తర్వాత కూడా “ఈ చంద్రబాబును ముఖ్యమంత్రి అనాలా.. ముఖ్యకంత్రీ అనాలా?” అని ప్రశ్నించారు. మరి అప్పుడు.. బాబులో ‘రాజ్యాంగ పెద్ద’ కనిపించలేదా? తర్వాత.. అనేక సందర్భాల్లోనూ చంద్రబాబును దూషించారు. మరి అప్పుడు కూడా ఆయనలో రాజ్యాంగ పెద్ద కనిపించలేదా? అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
నొప్పి తనదాకా వచ్చే సరికి.. జగన్కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చిందనే కామెంట్లు నెటిజన్లు ఎక్కువ మంది చేస్తున్నారు. సీఎంగా ఎవరున్నా.. వారిని గౌరవ వాచకంతో పిలవాలనే సంప్రదాయం.. ఎవరో చెబితో.. జగన్ వినకపోవచ్చు.. కానీ… సాక్షాత్తూ.. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలో.. ఎక్కడా నోరు జారలేదు. ‘చంద్రబాబు అలా అన్నారా?’ అనే వ్యాఖ్యానించేవారే తప్ప.. ‘డా’ అనే పదం కూడా వైఎస్ నోటి వెంట ఎప్పుడూ వచ్చింది కాదు. ఇక, అసెంబ్లీలోనూ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.. తప్ప.. ఎంత ఆగ్రహం వచ్చినా.. నోరు జారింది లేదు. అయినా.. ఇప్పుడు జగన్ .. సూక్తులు చెబుతూ… తాను తింటున్నది గొంగళీలో అన్నమన్న విషయాన్ని మరిచిపోయారని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on October 21, 2021 4:19 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…