Political News

‘కాన్సిట్యూష‌న‌ల్ హెడ్‌..’ త‌ల‌ న‌రికేయొచ్చా..జ‌గ‌న్ స‌ర్‌!!

ఒక‌టి అని రెండు అనిపించుకోవ‌డం.. అంటే ఇదే అంటున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చూసిన‌.. నెటిజ‌న్లు. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌డిచిన రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వ‌రుసగా రెండోరోజూ ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రోసారి జ‌గ‌న్ గుర్తు చేశారు. అయితే.. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న బోష్‌డీకే.. అనే మాట‌కు అర్ధం చెప్పారు. అది ఇదీ.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

“ఒక ముఖ్య‌మంత్రి, రాష్ట్రంలో ఒక కాన్ట్సిట్యూష‌న్ హెడ్‌నే ఇలా బోష్‌డీకే అంటూ.. మాట్లాడ‌తారా? ఇంక‌, ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంది? ఇదేనా.. చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌కు నేర్పిస్తున్న మ‌ర్యాద‌?” అంటూ విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అంటే.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు రాజ్యాంగానికి హెడ్ అయిన‌ప్పుడు.. గ‌తంలో జ‌గ‌న్ కూడా ఇలాంటి మాట‌లే అన్నారు క‌దా.. మ‌రి అప్ప‌ట్లో .. కాన్ట్సిట్యూష‌న్ హెడ్ అన్న విష‌యం ఆయ‌న‌కు గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా నంద్యాల ఉప ఎన్నిక‌లో జ‌రిగిన ఘ‌ట‌ను వారు గుర్తు చేస్తున్నారు.

2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న జ‌గ‌న్‌.. నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి.. “ఈ ముఖ్య‌మంత్రిని బ‌హిరంగంగా కాల్చిచంపినా త‌ప్పులేద‌నిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. మ‌రి ఆనాడు.. సీఎంగా ఉన్న చంద్ర‌బాబు కాన్ట్సిట్యూష‌న్ హెడ్ గా జ‌గ‌న్ అనుకోలేదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

త‌ర్వాత కూడా “ఈ చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి అనాలా.. ముఖ్య‌కంత్రీ అనాలా?” అని ప్ర‌శ్నించారు. మ‌రి అప్పుడు.. బాబులో ‘రాజ్యాంగ పెద్ద‌’ క‌నిపించ‌లేదా? త‌ర్వాత‌.. అనేక సంద‌ర్భాల్లోనూ చంద్ర‌బాబును దూషించారు. మ‌రి అప్పుడు కూడా ఆయ‌న‌లో రాజ్యాంగ పెద్ద క‌నిపించ‌లేదా? అని నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు.

నొప్పి త‌న‌దాకా వ‌చ్చే స‌రికి.. జ‌గ‌న్‌కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వ‌చ్చింద‌నే కామెంట్లు నెటిజ‌న్లు ఎక్కువ మంది చేస్తున్నారు. సీఎంగా ఎవ‌రున్నా.. వారిని గౌర‌వ వాచ‌కంతో పిల‌వాల‌నే సంప్ర‌దాయం.. ఎవ‌రో చెబితో.. జ‌గ‌న్ వినక‌పోవ‌చ్చు.. కానీ… సాక్షాత్తూ.. ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో, ఆయ‌న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న టైంలో.. ఎక్క‌డా నోరు జార‌లేదు. ‘చంద్ర‌బాబు అలా అన్నారా?’ అనే వ్యాఖ్యానించేవారే త‌ప్ప‌.. ‘డా’ అనే ప‌దం కూడా వైఎస్ నోటి వెంట ఎప్పుడూ వ‌చ్చింది కాదు. ఇక‌, అసెంబ్లీలోనూ ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు.. త‌ప్ప‌.. ఎంత ఆగ్ర‌హం వ‌చ్చినా.. నోరు జారింది లేదు. అయినా.. ఇప్పుడు జ‌గ‌న్ .. సూక్తులు చెబుతూ… తాను తింటున్న‌ది గొంగ‌ళీలో అన్న‌మ‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

This post was last modified on October 21, 2021 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

10 hours ago