ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పోలీసుల నుంచి షాకులు తప్పలేదు. టీడీ పీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.. ఏకంగా.. చంద్రబాబును కూడా ముప్పుతిప్పలు పెట్టారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. చంద్రబా బు.. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో తన నివాసం ఉండవల్లిలోని.. కరకట్ట నుంచి మంగళగిరి ఆఫీస్కు వచ్చేందుకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు దారిమళ్లించారు.
చంద్రబాబు వెళుతున్న కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చారు. అదేసమయంలో సీఎం బయల్దేరడం తో మార్గం మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి వైపు కాకుండా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వా య్ మళ్లించారు. దీంతో రూట్ మారడంతో 20 నిమిషాలు ఆలస్యంగా చంద్రబాబు దీక్షాస్థలికి చేరుకున్నారు.
అయితే.. దీనిపై.. టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉండవల్లి సహా విజయవాడ లోనూ నాయకులు నిరసనకు దిగారు. ఉద్దేశ పూర్వకంగా.. చంద్రబాబు కాన్వాయ్ను దారి మళ్లించారని.. దీక్షను భగ్నం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయితే.. 8.40 నిమిషాలకు టీడీపీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు దీక్ష చేపట్టారు.
చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమయ్యింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యే బాబు దీక్షకు కూర్చున్నారు.
నాయకులు, కార్యకర్తలు.. పెద్ద ఎత్తున ఆఫీస్కు చేరుకున్నారు. చాలా మంది ముఖ్య నేతలు.. నిన్న రాత్రికే విజయవాడ, మంగళగిరికి చేరుకున్నారు. అక్కడే బస చేసి.. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఈ రోజు ఉదయం 8గంటలకు ప్రారంభం కావాల్సిన చంద్రబాబు దీక్ష ఆలస్యంగా మొదలయ్యింది.
This post was last modified on October 21, 2021 3:42 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…