ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పోలీసుల నుంచి షాకులు తప్పలేదు. టీడీ పీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.. ఏకంగా.. చంద్రబాబును కూడా ముప్పుతిప్పలు పెట్టారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. చంద్రబా బు.. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో తన నివాసం ఉండవల్లిలోని.. కరకట్ట నుంచి మంగళగిరి ఆఫీస్కు వచ్చేందుకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు దారిమళ్లించారు.
చంద్రబాబు వెళుతున్న కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చారు. అదేసమయంలో సీఎం బయల్దేరడం తో మార్గం మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి వైపు కాకుండా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వా య్ మళ్లించారు. దీంతో రూట్ మారడంతో 20 నిమిషాలు ఆలస్యంగా చంద్రబాబు దీక్షాస్థలికి చేరుకున్నారు.
అయితే.. దీనిపై.. టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉండవల్లి సహా విజయవాడ లోనూ నాయకులు నిరసనకు దిగారు. ఉద్దేశ పూర్వకంగా.. చంద్రబాబు కాన్వాయ్ను దారి మళ్లించారని.. దీక్షను భగ్నం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయితే.. 8.40 నిమిషాలకు టీడీపీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు దీక్ష చేపట్టారు.
చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమయ్యింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యే బాబు దీక్షకు కూర్చున్నారు.
నాయకులు, కార్యకర్తలు.. పెద్ద ఎత్తున ఆఫీస్కు చేరుకున్నారు. చాలా మంది ముఖ్య నేతలు.. నిన్న రాత్రికే విజయవాడ, మంగళగిరికి చేరుకున్నారు. అక్కడే బస చేసి.. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఈ రోజు ఉదయం 8గంటలకు ప్రారంభం కావాల్సిన చంద్రబాబు దీక్ష ఆలస్యంగా మొదలయ్యింది.
This post was last modified on October 21, 2021 3:42 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…