Political News

లోకేష్ శ‌ప‌థం: వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం..

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. మంగ‌ళ వారం జ‌రిగిన టీడీపీ కార్యాల‌యంపై దాడిపై లోకేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీతో స‌హా తాము చెల్లిస్తామ‌ని.. దేశం లో ఎక్క‌డ దాక్కున్నా..ఏ ఒక్కొరినీ వ‌దిలిపెట్టేది లేద‌ని.. స్ప‌ష్టం చేశారు. త‌మ ఓర్పు స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారని అన్న లోకేష్‌.. వైసీపీ కుక్క‌ల‌కు పోలీసులే సాయం చేస్తున్నార‌ని.. నిప్పులు చెరిగారు.

టీడీపీ దేవాల‌యంపై దాడి చేస్తే.. పోలీసులు ప్రేక్ష‌క పాత్ర పోషించారని, ఒక‌ప్పుడు పోలీసులు ఆద‌ర్శంగా ఉన్నారని… కానీ, ఇప్పుడు ఏపీ పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. త‌మ కు వైసీపీ నేత‌ల నుంచే కాకుండా.. పోలీసులు కూడా ఇబ్బందులు క‌ల్పిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కూడా.. పోలీసులు స‌రిగా స్పందించ‌లేద‌న్నారు. 24 గంట‌లైనా.. ఎందుకు ఒక్క‌రిని కూడా అరెస్టు చేయ‌లేక‌పోయారు? ఇది డీజీపి చేత‌కాని త‌నం కాదా? పోస్టింగుల కోసం గ‌తంలో చంద్ర‌బాబుకు ఫోన్ చేసిన విష‌యం గుర్తులేదా? అంటూ.. డీజీగౌతం స‌వాంగ్‌ను ప్ర‌శ్నించారు.

బూతుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైసీపీనే అంటూ.. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోను లోకేష్ ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు. వైసీపీ నేత‌ల‌కు కూడా డ్ర‌గ్స్‌లో వాటాలు ఉన్నాయ‌ని అన్నారు. దాడుల‌కు తాము భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. సైకో రెడ్డికి భాస్క‌ర్ అవార్డు ఇవ్వాల‌ని.. ముఖ్య‌మంత్రిని ఎద్దేవా చేశారు. గ‌తంలో చంద్ర‌బాబు కాల‌ర్ ప‌ట్టుకోవాల‌ని అన్న‌ప్పుడు పోలీసుల‌కు క‌నిపించ‌లేదా?.. చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపాల‌ని అన్న‌ప్పుడు పోలీసులు ఏం చేశారు? అని ప్ర‌శ్నించారు.

డ్ర‌గ్స్ ఎక్క‌డ దొరికినా.. ఏపీలోనే మూలాలు ఉంటున్నాయన్న లోకేష్‌.. ఇదే విష‌యాన్ని హైద‌రాబాద్ పోలీసులు చెబుతున్నార‌ని.. మ‌హారాష్ట్ర పోలీసులు కూడా స్ప‌ష్టం చేస్తున్నార‌ని.. అయినా.. ఏపీ పోలీసులు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇదే విష‌యాన్ని తాము ప్ర‌శ్నిస్తే.. దాడులు చేస్తారా? అని నిల‌దీశారు. చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేసిన‌ప్పుడే క‌ఠిన సెక్ష‌న్లు పెట్టి ఉంటే.. ఇంత దూరం వ‌చ్చేది కాద‌ని అన్నారు. 2024లో వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వమేన‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పుడు త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని.. వైసీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

చంద్ర‌బాబుకు ఓపిక ఎక్కువ‌ని.. కానీ, తాను మాత్రం అలా కాద‌ని.. లోకేష్ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ సైకో శాడిస్ట్ అనుకున్నాం.. అది నిన్న‌టితో నిర్ధార‌ణ అయింద‌ని.. లోకేష్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ కార్యాల‌యంపై దాడి జ‌రిగే 15 నిమిషాల ముందుగానే.. తాము పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చామ‌ని… అయితే.. ఏ ఒక్క‌రూ రాలేద‌ని.. అందుకే ఆ పోలీసులు తాము ప్ర‌శ్నించామ‌ని.. లోకేష్ చెప్పుకొచ్చారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

26 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago