టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మంగళ వారం జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడిపై లోకేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీతో సహా తాము చెల్లిస్తామని.. దేశం లో ఎక్కడ దాక్కున్నా..ఏ ఒక్కొరినీ వదిలిపెట్టేది లేదని.. స్పష్టం చేశారు. తమ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్న లోకేష్.. వైసీపీ కుక్కలకు పోలీసులే సాయం చేస్తున్నారని.. నిప్పులు చెరిగారు.
టీడీపీ దేవాలయంపై దాడి చేస్తే.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, ఒకప్పుడు పోలీసులు ఆదర్శంగా ఉన్నారని… కానీ, ఇప్పుడు ఏపీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. తమ కు వైసీపీ నేతల నుంచే కాకుండా.. పోలీసులు కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా.. పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. 24 గంటలైనా.. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు? ఇది డీజీపి చేతకాని తనం కాదా? పోస్టింగుల కోసం గతంలో చంద్రబాబుకు ఫోన్ చేసిన విషయం గుర్తులేదా? అంటూ.. డీజీగౌతం సవాంగ్ను ప్రశ్నించారు.
బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీనే అంటూ.. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను లోకేష్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. వైసీపీ నేతలకు కూడా డ్రగ్స్లో వాటాలు ఉన్నాయని అన్నారు. దాడులకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. సైకో రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలని.. ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు కాలర్ పట్టుకోవాలని అన్నప్పుడు పోలీసులకు కనిపించలేదా?.. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నప్పుడు పోలీసులు ఏం చేశారు? అని ప్రశ్నించారు.
డ్రగ్స్ ఎక్కడ దొరికినా.. ఏపీలోనే మూలాలు ఉంటున్నాయన్న లోకేష్.. ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారని.. మహారాష్ట్ర పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారని.. అయినా.. ఏపీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని.. ఇదే విషయాన్ని తాము ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అని నిలదీశారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడే కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే.. ఇంత దూరం వచ్చేది కాదని అన్నారు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. వైసీపీ నేతలను హెచ్చరించారు.
చంద్రబాబుకు ఓపిక ఎక్కువని.. కానీ, తాను మాత్రం అలా కాదని.. లోకేష్ చెప్పుకొచ్చారు. జగన్ సైకో శాడిస్ట్ అనుకున్నాం.. అది నిన్నటితో నిర్ధారణ అయిందని.. లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగే 15 నిమిషాల ముందుగానే.. తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని… అయితే.. ఏ ఒక్కరూ రాలేదని.. అందుకే ఆ పోలీసులు తాము ప్రశ్నించామని.. లోకేష్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…