Political News

లోకేష్ శ‌ప‌థం: వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం..

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. మంగ‌ళ వారం జ‌రిగిన టీడీపీ కార్యాల‌యంపై దాడిపై లోకేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీతో స‌హా తాము చెల్లిస్తామ‌ని.. దేశం లో ఎక్క‌డ దాక్కున్నా..ఏ ఒక్కొరినీ వ‌దిలిపెట్టేది లేద‌ని.. స్ప‌ష్టం చేశారు. త‌మ ఓర్పు స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారని అన్న లోకేష్‌.. వైసీపీ కుక్క‌ల‌కు పోలీసులే సాయం చేస్తున్నార‌ని.. నిప్పులు చెరిగారు.

టీడీపీ దేవాల‌యంపై దాడి చేస్తే.. పోలీసులు ప్రేక్ష‌క పాత్ర పోషించారని, ఒక‌ప్పుడు పోలీసులు ఆద‌ర్శంగా ఉన్నారని… కానీ, ఇప్పుడు ఏపీ పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. త‌మ కు వైసీపీ నేత‌ల నుంచే కాకుండా.. పోలీసులు కూడా ఇబ్బందులు క‌ల్పిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కూడా.. పోలీసులు స‌రిగా స్పందించ‌లేద‌న్నారు. 24 గంట‌లైనా.. ఎందుకు ఒక్క‌రిని కూడా అరెస్టు చేయ‌లేక‌పోయారు? ఇది డీజీపి చేత‌కాని త‌నం కాదా? పోస్టింగుల కోసం గ‌తంలో చంద్ర‌బాబుకు ఫోన్ చేసిన విష‌యం గుర్తులేదా? అంటూ.. డీజీగౌతం స‌వాంగ్‌ను ప్ర‌శ్నించారు.

బూతుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైసీపీనే అంటూ.. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోను లోకేష్ ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు. వైసీపీ నేత‌ల‌కు కూడా డ్ర‌గ్స్‌లో వాటాలు ఉన్నాయ‌ని అన్నారు. దాడుల‌కు తాము భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. సైకో రెడ్డికి భాస్క‌ర్ అవార్డు ఇవ్వాల‌ని.. ముఖ్య‌మంత్రిని ఎద్దేవా చేశారు. గ‌తంలో చంద్ర‌బాబు కాల‌ర్ ప‌ట్టుకోవాల‌ని అన్న‌ప్పుడు పోలీసుల‌కు క‌నిపించ‌లేదా?.. చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపాల‌ని అన్న‌ప్పుడు పోలీసులు ఏం చేశారు? అని ప్ర‌శ్నించారు.

డ్ర‌గ్స్ ఎక్క‌డ దొరికినా.. ఏపీలోనే మూలాలు ఉంటున్నాయన్న లోకేష్‌.. ఇదే విష‌యాన్ని హైద‌రాబాద్ పోలీసులు చెబుతున్నార‌ని.. మ‌హారాష్ట్ర పోలీసులు కూడా స్ప‌ష్టం చేస్తున్నార‌ని.. అయినా.. ఏపీ పోలీసులు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇదే విష‌యాన్ని తాము ప్ర‌శ్నిస్తే.. దాడులు చేస్తారా? అని నిల‌దీశారు. చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేసిన‌ప్పుడే క‌ఠిన సెక్ష‌న్లు పెట్టి ఉంటే.. ఇంత దూరం వ‌చ్చేది కాద‌ని అన్నారు. 2024లో వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వమేన‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పుడు త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని.. వైసీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

చంద్ర‌బాబుకు ఓపిక ఎక్కువ‌ని.. కానీ, తాను మాత్రం అలా కాద‌ని.. లోకేష్ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ సైకో శాడిస్ట్ అనుకున్నాం.. అది నిన్న‌టితో నిర్ధార‌ణ అయింద‌ని.. లోకేష్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ కార్యాల‌యంపై దాడి జ‌రిగే 15 నిమిషాల ముందుగానే.. తాము పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చామ‌ని… అయితే.. ఏ ఒక్క‌రూ రాలేద‌ని.. అందుకే ఆ పోలీసులు తాము ప్ర‌శ్నించామ‌ని.. లోకేష్ చెప్పుకొచ్చారు.

This post was last modified on October 20, 2021 11:51 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

7 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

8 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

9 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

10 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

13 hours ago