Political News

బద్వేలు : కాంగ్రెస్ మైండ్ గేమ్ ఇదేనా

ట్విస్టుల‌తో సాగుతూ మ‌లుపులు తిరుగుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మారింది. ఏక‌గ్రీవం అవుతుంద‌నుకున్న ఈ ఎన్నిక‌లో ఇప్పుడు ప్ర‌ధానంగా అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. వైసీపీ నుంచి దివంగ‌త ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య భార్య సుధ బీజేపీ నుంచి విద్యార్థి నాయ‌కుడు సురేశ్ కాంగ్రెస్ నుంచి పీఎం క‌మ‌ల‌మ్మ బ‌రిలో దిగారు. అక్టోబ‌ర్ 30నే పోలింగ్ ఉండ‌డంతో ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని అన్ని పార్టీలు హోరెత్తించాయి. ఈ ఎన్నిక‌లో వైసీపీదే విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ బీజేపీతో పాటు కాంగ్రెస్ త‌మ స‌త్తాచాటాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌లో పోటీ చేయ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌య‌మే.

చ‌నిపోయిన ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుల‌కే వైసీపీ టికెట్ ఇవ్వ‌డంతో రాజ‌కీయ విలువ‌ల‌ను పాటించి పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సంప్ర‌దాయాన్ని పాటిస్తూ టీడీపీ కూడా పోటీ నుంచి త‌ప్పుకుంది. దీంతో ఎన్నిక ఏక‌గ్రీవం అవుతుంద‌ని అనిపించింది. కానీ వార‌స‌త్వ రాజ‌కీయాల వ‌ద్దంటూ బీజేపీ పోటీకి సై అంది. కాంగ్రెస్ కూడా బ‌రిలో నిలిచింది. మ‌రి టీడీపీ జ‌న‌సేన పోటీలో లేన‌పుడు ఆ పార్టీ అభిమానులు అనుచ‌రులు కార్య‌క‌ర్త‌లు ఓట్లు ఎవ‌రికి ప‌డ‌తాయానే చ‌ర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విడ‌గొట్టి తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా చేశార‌నే కోపంతో ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నామ‌రూప‌ల్లేకుండా చేశారు. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ దారుణ‌మైన ఫ‌లితాలు మూట‌గ‌ట్టుకుంది. ముఖ్యంగా గత ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత ఆ పార్టీ ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. దివంగ‌త కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ పేరుతో ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ వైసీపీ పార్టీ పెట్టిన త‌ర్వాత కాంగ్రెస్ కీల‌క నేత‌లంద‌రూ ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీ పాతాలానికి ప‌డిపోయింది. పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న శైల‌జానాథ్ పార్టీ బ‌లోపేతంపై ఎలాంటి దృష్టి సారించ‌డం లేద‌నే అభిప్రాయాలున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో బ‌ద్వేలులో కాంగ్రెస్ పోటీ చేయ‌డం వెన‌క మ‌రో ప్లాన్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ జ‌న‌సేన పోటీలో లేవు కాబ‌ట్టి అధికార వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను పొంది క‌నీసం డిపాజిట్ తెచ్చుకుని రాష్ట్రంలో పార్టీ ఇంకా బ‌తికే ఉంద‌ని చాటి చెప్ప‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశంగా క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన రాజ‌శేఖ‌ర్‌కు 50 వేల‌కు పైగా ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు టీడీపీ పోటీలో లేదు. దానితో పొత్తు పెట్టుకుంటుంద‌నే ప్ర‌చారం సాగుతున్న జ‌న‌సేన కూడా బ‌రిలో లేదు. ఇక బీజేపీతో బంధం తెచ్చుకునేందుకు జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. ఆ టీడీపీ ఓట్లు బీజేపీకి ప‌డ‌డం క‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలో మిగిలింది ఇక కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. ఈ ప‌రిస్థితుల్లో ఆ పార్టీకి గ‌త ఎన్నిక‌ల‌తో (2337 ఓట్లు) పోలిస్తే ఈ సారి మెరుగ్గానే ఫ‌లితం ద‌క్కే వీలుందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on October 22, 2021 9:26 am

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

6 minutes ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

3 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

5 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

6 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

6 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

6 hours ago