టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా.. ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఏకంగా 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష చేయాలని నిర్ణయించారు. నిజానికి ఇలాంటి దీక్ష, ఇంతసేపు చేయడం.. చంద్రబాబు రాజకీయ జీవితంలోనే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నాయకులు దాడులకు దిగారు. ఈ క్రమంలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారనేది టీడీపీ నేతల ఆరోపణ.
ఈ క్రమంలో వైసీపీ నేతల దాడులకు నిరసనగా.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. అయితే.. అధికార పార్టీ నుంచి ఎలాంటి సర్దుబాటు ధోరణి కనిపించకపోగా.. ఈ పరిస్థితిని ఇలానే వదిలేస్తే.. బాగుండదని.. అనుకున్నారో.. ఏమో.. చంద్రబాబు 36 గంటల దీక్షకు రెడీ అయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు నిరసన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబందించిన ప్లాన్ను ఆయన మీడియాకు విడుదల చేశారు.
పార్టీ కార్యాలయంలోనే ఎన్టీఆర్ విగ్రహం వద్దే కూర్చుని దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించడం గమనార్హం. అంతేకాదు.. ఎక్కడైతే.. అద్దాలు పగిలాయో.. ఎక్కడైతే.. పార్టీ కార్యాలయం ధ్వంసమైందో.. అక్కడే దీక్షకు కూర్చోవాలని నిర్ణయించారు. అదేసమయంలో జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో దీక్షలు చేయాలని.. పార్టీ జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చారు. మరోవైపు.. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఆయన శనివారం ఢిల్లీకి వెళ్లి.. స్వయంగా హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి.. ఇక్కడి విషయాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా కేంద్రంలో తనకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి .. దీనిపై చర్చించాలని కూడా చంద్రబాబు నిర్ణయించడం గమనార్హం. సో.. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడి ఘటనలను చంద్రబాబు చాలా సీరియస్గానే తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…