Political News

36 గంట‌ల పాటు చంద్ర‌బాబు నిర‌స‌న దీక్ష‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. ఆయ‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఏకంగా 36 గంట‌ల పాటు చంద్ర‌బాబు దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. నిజానికి ఇలాంటి దీక్ష‌, ఇంత‌సేపు చేయ‌డం.. చంద్ర‌బాబు రాజకీయ జీవితంలోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు దాడుల‌కు దిగారు. ఈ క్ర‌మంలో కార్యాల‌యాన్ని ధ్వంసం చేశార‌నేది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌.

ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల‌ దాడుల‌కు నిర‌స‌న‌గా.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే.. అధికార పార్టీ నుంచి ఎలాంటి స‌ర్దుబాటు ధోర‌ణి క‌నిపించ‌క‌పోగా.. ఈ ప‌రిస్థితిని ఇలానే వ‌దిలేస్తే.. బాగుండ‌ద‌ని.. అనుకున్నారో.. ఏమో.. చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష‌కు రెడీ అయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌రకు నిర‌స‌న దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబందించిన ప్లాన్‌ను ఆయ‌న మీడియాకు విడుద‌ల చేశారు.

పార్టీ కార్యాల‌యంలోనే ఎన్టీఆర్ విగ్ర‌హం వద్దే కూర్చుని దీక్ష చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఎక్క‌డైతే.. అద్దాలు ప‌గిలాయో.. ఎక్క‌డైతే.. పార్టీ కార్యాల‌యం ధ్వంస‌మైందో.. అక్క‌డే దీక్ష‌కు కూర్చోవాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో జిల్లాల్లోనూ పార్టీ కార్యాల‌యాల్లో దీక్ష‌లు చేయాల‌ని.. పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌కు పిలుపునిచ్చారు. మ‌రోవైపు.. పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న శ‌నివారం ఢిల్లీకి వెళ్లి.. స్వ‌యంగా హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి.. ఇక్క‌డి విష‌యాలపై ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేవిధంగా కేంద్రంలో త‌న‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి .. దీనిపై చ‌ర్చించాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌ల‌ను చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

29 minutes ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

32 minutes ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

2 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

6 hours ago