తొందరలోనే ఏపీలో మినీ సమరానికి తెరలేవనున్నది. వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించటానికి స్టేట్ ఎలక్షన్ కమీషన్ రంగం సిద్ధం చేస్తున్నది. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సుమారు 12 మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. వార్డుల డివిజన్ సరిగాలేదని, రిజర్వేషన్లు సక్రమంగా కేటాయించలేదనే కారణాలతో ఎన్నికలు జరగలేదు.
కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ఓటర్ల జాబితా మీద కూడా వివాదాలు రేగటంతో ఎన్నికలు జరపలేదు. ఇపుడు అలాంటి వివాదాలన్నింటినీ అధికారులు సర్దుబాటు చేశారు. దాంతో అన్నీ రాజకీయపార్టీల ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకుని ఎన్నికల నిర్వహణకు డేట్ డిసైడ్ చేయటానికి కమిషన్ రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీన ముసాయిదా విడుదల చేయాలని కమిషన్ వివిధ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజుల తర్వాత అంటే 23వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఎన్నికలు జరగబోయే వాటిల్లో నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు మరో 20 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.
తొందరలో జరగబోయే ఎన్నికలు తొమ్మిది జిల్లాల్లోని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలు, పశ్చిమగోదావరి, కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాష్ట్రంలోని ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టే వీటిని మినీ సమరం అంటున్నది. మరి జనాల తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్న విషయం ఆసక్తిగా మారింది.
This post was last modified on October 18, 2021 11:47 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…