తొందరలోనే ఏపీలో మినీ సమరానికి తెరలేవనున్నది. వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించటానికి స్టేట్ ఎలక్షన్ కమీషన్ రంగం సిద్ధం చేస్తున్నది. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సుమారు 12 మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. వార్డుల డివిజన్ సరిగాలేదని, రిజర్వేషన్లు సక్రమంగా కేటాయించలేదనే కారణాలతో ఎన్నికలు జరగలేదు.
కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ఓటర్ల జాబితా మీద కూడా వివాదాలు రేగటంతో ఎన్నికలు జరపలేదు. ఇపుడు అలాంటి వివాదాలన్నింటినీ అధికారులు సర్దుబాటు చేశారు. దాంతో అన్నీ రాజకీయపార్టీల ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకుని ఎన్నికల నిర్వహణకు డేట్ డిసైడ్ చేయటానికి కమిషన్ రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీన ముసాయిదా విడుదల చేయాలని కమిషన్ వివిధ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజుల తర్వాత అంటే 23వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఎన్నికలు జరగబోయే వాటిల్లో నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు మరో 20 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.
తొందరలో జరగబోయే ఎన్నికలు తొమ్మిది జిల్లాల్లోని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలు, పశ్చిమగోదావరి, కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాష్ట్రంలోని ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టే వీటిని మినీ సమరం అంటున్నది. మరి జనాల తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్న విషయం ఆసక్తిగా మారింది.
This post was last modified on October 18, 2021 11:47 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…