చంద్రబాబు మీద విపరీతమైన అభిమానాన్ని చూపించే విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరికొన్ని సందర్భాల్లో ఆయనపై తనకున్న ఆగ్రహాన్ని వెల్లడించేందుకు.. ఓపెన్ అయ్యేందుకు ఏ మాత్రం వెనుకాడరు. ఇటీవల కాలంలో బాబుతో పొసగక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చేయటమే కాదు.. తన కుమార్తె కూడా బరిలో ఉండదని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా ఆయన తన పార్టీ ఆఫీసులో చేసిన మార్పు హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడలోని తన ఆఫీసుబయట గోడకు చంద్రబాబు ఫోటో ఉండేది. ఇటీవల కాలంలో బాబు మీద గుస్సాగా ఉన్న కేశినేని.. తాజాగా ఆయన ఫోటో స్థానంలో వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో ఉన్న ఫోటోను ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. తన పార్టమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. వాటి ఇన్ ఛార్జుల ఫోటోలతో పాటు.. ఇతర ముఖ్యనేతల ఫోటోల్ని కూడా తొలగించేశారు.
అదే సమయంలో చంద్రబాబు ఫోటో స్థానే.. రతన్ టాటా ఫోటోను ఏర్పాటు చేశారు. అదే సమయంలో టాటా ట్రస్టు.. తన ఎంపీ నిధులతో గతంలో తాము చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలిసేలా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. దీంతో.. ఇంతకాలం కేశినేని వర్సెస్ బాబు మధ్య సమ్ థింగ్ తేడా వచ్చిందన్న ప్రచారం తాజాగా ఆధారాలతో సహా నిజమైందన్న మాట వినిపిస్తోంది.
మరి.. కేశినేని తాజా అడుగులు ఏటువైపున అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్న మాటను చెబుతున్నారు. బాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్ లాంటి వారు బీజేపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కేశినేని సైతం అలాంటి నిర్ణయమే తీసుకుంటారా? మరేదైనా ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on October 18, 2021 11:10 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…