Political News

బొగ్గు కొరత కేంద్రం కుట్రేనా ?

మనదేశంలో బొగ్గుకు కొరత లేదని కావాలని కేంద్రమే కృత్రిమ కొరత సృష్టించిందా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అనేక అంశాలపై తనదైన శైలిలో ప్రొఫెసర్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లోని లోటుపాట్లను ఎండగడుతుంటారు. తాజాగా దేశం ఎదుర్కొంటున్న బొగ్గు కొరత, విద్యుత్ ఉత్పత్తి సమస్యలపై ప్రొఫెసర్ మాట్లాడుతు ప్రస్తుత బొగ్గు కొరత కావాలని కేంద్రమే సృష్టించిందంటు మండిపడ్డారు.

దేశంలో ఎంతో పాపులరైన కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు ఆరోపించారు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ప్రధానంగా 2019 తర్వాత ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేయటం, లేకపోతే మూసేయటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వరంగ సంస్ధలను ప్రైవేటుపరం చేయటం ద్వారా రు. 6 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇందులో భాగంగానే ప్రైవేటుకు అమ్మేయాల్సిన ప్రభుత్వరంగ సంస్ధల జాబితాను కూడా కేంద్రం ఎప్పుడో ప్రకటించేసింది. ఇందులో భాగంగానే కోల్ ఇండియా మీద కూడా మోడి ప్రభుత్వం కన్నుపడిందంటు ప్రొఫెసర్ మండిపడ్డారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనదేశం నాలుగోస్ధానంలో ఉందన్నారు. అలాంటి ఇండియాలోనే బొగ్గు ఉత్పత్తికి, నిల్వలకు కొరత ఏమిటంటు వేసిన ప్రశ్న చాలా విలువైనదనే చెప్పాలి. కోల్ ఇండియాను ప్రైవేటీకరించటంలో భాగంగానే బొగ్గు గనులను కేంద్రం కేటాయించటంలేదన్నారు.

బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని తర్వాత ఆటోమేటిక్ గా విద్యుత్ చార్జీలు పెరిగిపోతాయన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం సరఫరా చేసే విద్యుత్ కన్నా తక్కువ ధరలకే తాము విద్యుత్ అందిస్తామని ప్రైవేటుసంస్ధలు రంగంలోకి దిగుతాయన్నారు. కొద్దిరోజులు తక్కువ ధరలకే విద్యుత్ ను సరఫరా చేసిన తర్వాత ప్రైవేటుసంస్ధలు ఒక్కసారిగా తమ ఉత్పత్తిని కూడా తగ్గించేసి ధరలు పెంచేస్ధాయని ప్రొఫెసర్ జోస్యం చెప్పారు.

కోల్ ఇండియాను విస్తరించటానికి బదులు నిర్వీర్యం చేయటానికే మోడి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కోల్ ఇండియా వల్ల దేశంలోని బొగ్గు ఆధారిటి విద్యుత్ ఉత్పత్తికి సరఫరా స్ట్రీమ్ లైన్ అవుతోందన్నారు. ఇలాంటి కోల్ ఇండియాకే బొగ్గుగనులు కేటాయించకపోతే బొగ్గు నిల్వలను ఎలా సర్దుబాటు చేస్తుందని ప్రొఫెసర్ కేంద్రాన్ని నిలదీశారు.  విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇనుప గనులను కేటాయించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లే కోల్ ఇండియాకు కూడా బొగ్గుగనులను కేటాయించకుండా మెల్లిగా నాశనం చేయటానికే మోడి సర్కార్ ప్లాన్ చేస్తోందన్నారు.

Satya

Recent Posts

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

40 minutes ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

1 hour ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

2 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

2 hours ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

2 hours ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

2 hours ago