తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒకలా.. టీఆర్ఎస్ గెలిస్తే మరోలా తెలంగాణ రాజకీయం మారుతుంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోయినా రెండో ప్లేసులో ఉన్నా కూడా మరో సరికొత్త రాజకీయాన్ని మనం చూస్తాం. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ కీలక రాజకీయ నేతపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్తో పాటు విపక్ష కాంగ్రెస్ వల వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ నేత ఎవరో కాదు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్.
కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగింది వివేక్ కుటుంబం. వివేక్ 2009లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభంజనం చూసి ఆ పార్టీలో చేరారు. చివరకు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడంతో ఎన్నికలకు ముందే మళ్లీ కాంగ్రెస్లోకి రివర్స్ జంప్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మళ్లీ మరోసారి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కూడా వివేక్కు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ వివేక్కు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన మరోసారి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన పారిశ్రామిక వేత్త, పైగా ఆయన చేతిలో వీ 6 మీడియా ఉంది. ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఆయన్ను ఆ పార్టీ వాడుకుంటోందే తప్పా ఆయనకు ఏ మాత్రం ఉపయోగం లేదు. ఈ విషయంపై ఆయన క్లారిటీతో ఉన్నారు. దీంతో మరోసారి ఆయన కండువా మార్చేందుకు టైం కోసం వెయిట్ చేస్తున్నారట.
వివేక్ అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉందంటున్నారు. పార్టీలోకి వస్తే రాజ్యసభ ఇస్తామని ఆఫర్ చేస్తోందట. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం వివేక్ను పార్టీలోకి తీసుకుని ఆయనకు పెద్దపల్లి ఎంపీ సీటుతో పాటు ఆయన తనయుడు వినోద్కు అసెంబ్లీ సీటు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇస్తామని చెపుతున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్తో అనుబంధం ఉన్న వివేక్ కుటుంబాన్ని వదులుకోమని రేవంత్ చెపుతున్నారట. మరి వివేక్ ఈ ఆఫర్లపై ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారనే అంటున్నారు.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…