తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒకలా.. టీఆర్ఎస్ గెలిస్తే మరోలా తెలంగాణ రాజకీయం మారుతుంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోయినా రెండో ప్లేసులో ఉన్నా కూడా మరో సరికొత్త రాజకీయాన్ని మనం చూస్తాం. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ కీలక రాజకీయ నేతపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్తో పాటు విపక్ష కాంగ్రెస్ వల వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ నేత ఎవరో కాదు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్.
కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగింది వివేక్ కుటుంబం. వివేక్ 2009లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభంజనం చూసి ఆ పార్టీలో చేరారు. చివరకు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడంతో ఎన్నికలకు ముందే మళ్లీ కాంగ్రెస్లోకి రివర్స్ జంప్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మళ్లీ మరోసారి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కూడా వివేక్కు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ వివేక్కు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన మరోసారి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన పారిశ్రామిక వేత్త, పైగా ఆయన చేతిలో వీ 6 మీడియా ఉంది. ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఆయన్ను ఆ పార్టీ వాడుకుంటోందే తప్పా ఆయనకు ఏ మాత్రం ఉపయోగం లేదు. ఈ విషయంపై ఆయన క్లారిటీతో ఉన్నారు. దీంతో మరోసారి ఆయన కండువా మార్చేందుకు టైం కోసం వెయిట్ చేస్తున్నారట.
వివేక్ అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉందంటున్నారు. పార్టీలోకి వస్తే రాజ్యసభ ఇస్తామని ఆఫర్ చేస్తోందట. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం వివేక్ను పార్టీలోకి తీసుకుని ఆయనకు పెద్దపల్లి ఎంపీ సీటుతో పాటు ఆయన తనయుడు వినోద్కు అసెంబ్లీ సీటు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇస్తామని చెపుతున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్తో అనుబంధం ఉన్న వివేక్ కుటుంబాన్ని వదులుకోమని రేవంత్ చెపుతున్నారట. మరి వివేక్ ఈ ఆఫర్లపై ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారనే అంటున్నారు.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…