Political News

అమరావతిపై మరో వివాదానికి తెర తీసిన ప్రభుత్వం

ఏపీ సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడంఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా జగన్ వదిలేశారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నా… వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులంటూ చెబుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతి కాదని, విశాఖ అని కొన్ని చోట్ల రావడం కలకలం రేపింది. అయితే, ఆ వ్యవహారం వివాదాస్పదం కావడంతో కేంద్ర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలే కాదు అందుకు తగ్గట్లు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. తాజాగా పదో తరగతి తెలుగు పాఠ్యాంశాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించారు. అందులో, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ని చేర్చారు. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ కూడా వివరించారు. అయితే, తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో అమరావతి పాఠాన్ని పాఠశాల విద్యాశాఖ తొలగించడం వివాదానికి కేంద్ర బిందువైంది.

తాజాగా 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం చర్చనీయాంశమైంది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను సేకరించి కొత్త పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. అయితే, పాత పుస్తకాల ప్రకారం సిలబస్ చెబుతున్న ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు. మరి, ఈ వివాదంపై ప్రభుత్వం స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

51 minutes ago

ఐశ్వర్య చెప్పింది నిజమేనా?

ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…

3 hours ago

నయా మోసం… బాబుతో వీడియో కాల్

ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…

3 hours ago

మణిరత్నం ఐకానిక్ సీన్ వెనుక వెనుక చిరు

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…

4 hours ago

ముద్ర‌గ‌డ‌తో వంగ‌వీటి కుమార్తె భేటీ?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో ప్ర‌ముఖ నాయ‌కుడు, దివంగత వంగ‌వీటి రంగా కుమార్తె..…

4 hours ago

శర్వానంద్ ‘భోగి’కి భలే కలిసి వచ్చింది

కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…

5 hours ago