ఏపీ సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడంఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా జగన్ వదిలేశారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నా… వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులంటూ చెబుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతి కాదని, విశాఖ అని కొన్ని చోట్ల రావడం కలకలం రేపింది. అయితే, ఆ వ్యవహారం వివాదాస్పదం కావడంతో కేంద్ర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలే కాదు అందుకు తగ్గట్లు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. తాజాగా పదో తరగతి తెలుగు పాఠ్యాంశాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించారు. అందులో, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ని చేర్చారు. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ కూడా వివరించారు. అయితే, తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో అమరావతి పాఠాన్ని పాఠశాల విద్యాశాఖ తొలగించడం వివాదానికి కేంద్ర బిందువైంది.
తాజాగా 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం చర్చనీయాంశమైంది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను సేకరించి కొత్త పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. అయితే, పాత పుస్తకాల ప్రకారం సిలబస్ చెబుతున్న ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు. మరి, ఈ వివాదంపై ప్రభుత్వం స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on October 6, 2021 4:16 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…