Political News

టీడీపీ ఎంపి గల్లా కుటుంబంపై కేసు

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. భూ ఆక్రమణ వివాదంలో రైతు ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఎంపితో పాటు ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తండ్రి గల్లా రామచంద్రనాయుడుపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించటంతో పోలీసులు వెంటనే పై ముగ్గురితో పాటు మరో 10 మందిపైన కేసులు నమోదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే గల్లా అరుణకుమారి తండ్రి, మాజీ ఎంపి రాజగాలనాయుడు పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటుచేశారు.

వాళ్ళ సొంత గ్రామమైన దిగువమాఘంలో ట్రస్టుపేరుతో భవనాలు నిర్మించారు. ఈ భవనాల కోసం కాంపౌండ్ వాలును కూడా నిర్మించారు. అయితే ఈ భవనాలకు సమీపంలోనే ఉన్న మరో రైతు గోపీకృష్ణ భూములకు కూడా కలిపి గల్లా కుటుంబం కాంపౌండ్ కట్టేసుకున్నది. తన భూములను కాంపౌండ్ లో కలిపేసుకున్న విషయాన్ని గ్రహించిన రైతు 2015 నుండి గల్లా కుటుంబంతో మాట్లాడుతునే ఉన్నారు. ఎన్నిసార్లు మాట్లాడిన గల్లా కుటుంబం స్పందించకపోవటంతో చేసేది లేక చివరకు చిత్తూరులోని నాలుగో అదనపు ఫస్ట్ క్లాన్ మెజిస్ట్రేట్ లో కేసు వేశారు.

రైతు పిటీషన్ను పరిశీలించిన కోర్టు వెంటనే బాధ్యులపై కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు పై ముగ్గురితో పాటు కోడలు గల్లా పద్మావతి, కూతురు గోగినేని రమాదేవి, ట్రస్టు కార్యదర్శి సీ. రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం పార్ధసారధి, భక్తవత్సలనాయుడు, ఎం మోహన్ బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపైన కూడా కేసులు నమోదుచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమధ్య తరచూ గల్లా కుటుంబంపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చిత్తూరులోని అమరరాజా యూనిట్ కు కూడా ప్రభుత్వం కేటాయించిన స్ధలం కన్నా అదనంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటు రెవిన్యు అధికారులు కేసులు నమోదుచేశారు. అలాగే యూనిట్ పై వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందని మరో కేసు నమోదైంది. మొత్తానికి గల్లా కుటుంబాన్ని ఒకదాని తర్వాత మరో కేసు తగులుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on September 30, 2021 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago