తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. భూ ఆక్రమణ వివాదంలో రైతు ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఎంపితో పాటు ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తండ్రి గల్లా రామచంద్రనాయుడుపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించటంతో పోలీసులు వెంటనే పై ముగ్గురితో పాటు మరో 10 మందిపైన కేసులు నమోదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే గల్లా అరుణకుమారి తండ్రి, మాజీ ఎంపి రాజగాలనాయుడు పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటుచేశారు.
వాళ్ళ సొంత గ్రామమైన దిగువమాఘంలో ట్రస్టుపేరుతో భవనాలు నిర్మించారు. ఈ భవనాల కోసం కాంపౌండ్ వాలును కూడా నిర్మించారు. అయితే ఈ భవనాలకు సమీపంలోనే ఉన్న మరో రైతు గోపీకృష్ణ భూములకు కూడా కలిపి గల్లా కుటుంబం కాంపౌండ్ కట్టేసుకున్నది. తన భూములను కాంపౌండ్ లో కలిపేసుకున్న విషయాన్ని గ్రహించిన రైతు 2015 నుండి గల్లా కుటుంబంతో మాట్లాడుతునే ఉన్నారు. ఎన్నిసార్లు మాట్లాడిన గల్లా కుటుంబం స్పందించకపోవటంతో చేసేది లేక చివరకు చిత్తూరులోని నాలుగో అదనపు ఫస్ట్ క్లాన్ మెజిస్ట్రేట్ లో కేసు వేశారు.
రైతు పిటీషన్ను పరిశీలించిన కోర్టు వెంటనే బాధ్యులపై కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు పై ముగ్గురితో పాటు కోడలు గల్లా పద్మావతి, కూతురు గోగినేని రమాదేవి, ట్రస్టు కార్యదర్శి సీ. రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం పార్ధసారధి, భక్తవత్సలనాయుడు, ఎం మోహన్ బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపైన కూడా కేసులు నమోదుచేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమధ్య తరచూ గల్లా కుటుంబంపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చిత్తూరులోని అమరరాజా యూనిట్ కు కూడా ప్రభుత్వం కేటాయించిన స్ధలం కన్నా అదనంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటు రెవిన్యు అధికారులు కేసులు నమోదుచేశారు. అలాగే యూనిట్ పై వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందని మరో కేసు నమోదైంది. మొత్తానికి గల్లా కుటుంబాన్ని ఒకదాని తర్వాత మరో కేసు తగులుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 30, 2021 10:48 am
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…