రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు మృతి చెందడంతో వచ్చిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ఇక్కడ.. వైసీపీ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల ని.. దేశం మొత్తం.. తిరుపతి వైపు చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీనికి ప్రధాన కారణం.. అన్ని వైపుల నుంచి టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి పోటీకి దిగడమే. అదే సమయంలో ప్రచారం జోరెత్తించడమే..!
సరే.. ఇప్పుడు ఏకంగా..ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని ఎస్సీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిం ది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా వైసీపీ భారీ మెజారిటీనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలు స్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. బద్వేల్లో వైసీపీ వరుస విజయాలు దక్కించు కుంటోంది.
గత ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ వెంకట సబ్బయ్య అకాల మరణం చెందారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక, 2014లో 9 వేల పైచిలుకు వచ్చిన వైసీపీ మెజారిటీ గత 2019లో ఏకంగా 44 వేల పైచిలుకు ఓట్లకు చేరింది.
ఇదే ఇప్పుడు వైసీపీలో అంచనాలు పెంచుతోంది. అధికారంలో లేనప్పుడే.. గత ఎన్నికల్లో 44 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నప్పుడు.. ఇప్పుడు లక్ష ఓట్లు మెజారిటీ ఎందుకు దక్కించుకోలేం అనేది వీరి ధీమాగా కనిపిస్తోంది.
This post was last modified on October 4, 2021 3:43 pm
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…