రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు మృతి చెందడంతో వచ్చిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ఇక్కడ.. వైసీపీ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల ని.. దేశం మొత్తం.. తిరుపతి వైపు చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీనికి ప్రధాన కారణం.. అన్ని వైపుల నుంచి టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి పోటీకి దిగడమే. అదే సమయంలో ప్రచారం జోరెత్తించడమే..!
సరే.. ఇప్పుడు ఏకంగా..ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని ఎస్సీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిం ది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా వైసీపీ భారీ మెజారిటీనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలు స్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. బద్వేల్లో వైసీపీ వరుస విజయాలు దక్కించు కుంటోంది.
గత ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ వెంకట సబ్బయ్య అకాల మరణం చెందారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక, 2014లో 9 వేల పైచిలుకు వచ్చిన వైసీపీ మెజారిటీ గత 2019లో ఏకంగా 44 వేల పైచిలుకు ఓట్లకు చేరింది.
ఇదే ఇప్పుడు వైసీపీలో అంచనాలు పెంచుతోంది. అధికారంలో లేనప్పుడే.. గత ఎన్నికల్లో 44 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నప్పుడు.. ఇప్పుడు లక్ష ఓట్లు మెజారిటీ ఎందుకు దక్కించుకోలేం అనేది వీరి ధీమాగా కనిపిస్తోంది.
This post was last modified on October 4, 2021 3:43 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…