రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు మృతి చెందడంతో వచ్చిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ఇక్కడ.. వైసీపీ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల ని.. దేశం మొత్తం.. తిరుపతి వైపు చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీనికి ప్రధాన కారణం.. అన్ని వైపుల నుంచి టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి పోటీకి దిగడమే. అదే సమయంలో ప్రచారం జోరెత్తించడమే..!
సరే.. ఇప్పుడు ఏకంగా..ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని ఎస్సీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిం ది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా వైసీపీ భారీ మెజారిటీనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలు స్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. బద్వేల్లో వైసీపీ వరుస విజయాలు దక్కించు కుంటోంది.
గత ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ వెంకట సబ్బయ్య అకాల మరణం చెందారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక, 2014లో 9 వేల పైచిలుకు వచ్చిన వైసీపీ మెజారిటీ గత 2019లో ఏకంగా 44 వేల పైచిలుకు ఓట్లకు చేరింది.
ఇదే ఇప్పుడు వైసీపీలో అంచనాలు పెంచుతోంది. అధికారంలో లేనప్పుడే.. గత ఎన్నికల్లో 44 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నప్పుడు.. ఇప్పుడు లక్ష ఓట్లు మెజారిటీ ఎందుకు దక్కించుకోలేం అనేది వీరి ధీమాగా కనిపిస్తోంది.
This post was last modified on October 4, 2021 3:43 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…