Political News

మోడికి సుప్రింకోర్టు పెద్ద షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోడికి సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కేంద్రం సమ్మతితో పనిలేకుండానే పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై వారం రోజుల్లో నిపుణుల కమిటిని వేయబోతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించటం కేంద్రప్రభుత్వం+బీజేపీలో సంచలనంగా మారింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందనే ఆరోపణలు దేశంలో ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. దీనిపై కొందరు వేసిన పిటీషన్లను సుప్రింకోర్టు విచారిస్తోంది.

విచారణ సందర్భంగా సుప్రింకోర్టుకు కేంద్రం పెద్దగా సహకరించటంలేదు. ఎప్పుడు విచారణ జరిగినా పెగాసస్ సాఫ్ట్ వేర్ తో ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేసిందా లేదా చెప్పమని స్వయంగా చీఫ్ జస్టిస్ ప్రశ్నించినా సమాధానం చెప్పటానికి సొలిసిటర్ జనరల్ నిరాకరించారు. ట్యాపింగ్ అంశంపై వివరమైన అఫిడవిట్ దాఖలు చేయమని అడిగినా కేంద్రం తరపున ఒక్కసారి కూడా అఫిడవిట్ దాఖలు కాలేదు. దాంతో కేంద్రం వైఖరిపై విసిగిపోయిన చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ పెగాసస్ విషయంలో సుప్రింకోర్టే ఏదో నిర్ణయం తీసుకుంటుందని గట్టిగానే హెచ్చరించారు.

చీఫ్ జస్టిస్ ఎంత హెచ్చరించినా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై తేల్చని కేంద్రం అసలు ఈ విషయమై సుప్రింకోర్టులో విచారణే జరగకూడదని వాదించింది. దేశభ్రదతకు సంబంధించిన విషయాలపై కోర్టులో విచారణ ఎలా చేస్తారంటు ఎదురు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ నే ప్రశ్నించింది. దీంతోనే అందరికీ అర్ధమైపోయింది పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం ఉపయోగించిందని. కాకపోతే అదే విషయాన్ని కేంద్రం ముఖతా వినాలని చీఫ్ జస్టిస్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.

కేంద్రం సహకరించని నేపధ్యంలో ఎన్నిరోజులు విచారించినా ఉపయోగం ఉండదని సుప్రింకోర్టుకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే తనంతట తానుగా ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయటానికి ఓ నిపుణుల కమిటీని వేయాలని డిసైడ్ అయిపోయింది. నిజానికి ఆ కమిటీని ఈ వారంలోనే నియమించాలని అనుకున్నా సాధ్యంకాలేదు. ఎందుకంటే కమిటీలో ఉండటానికి నిపుణులను ఎంపికచేస్తే అందులో కొందరు కమిటీలో ఉండటానికి నిరాకరించారట.

దాంతో కమిటీలో కొత్త సభ్యులను ఎంపిక చేయాల్సొచ్చింది. ఈ విషయన్ని కూడా ఎన్వీ రమణే చెప్పారు. నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు కాబట్టి తొందరలోనే కమిటిని వేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు నియమిస్తున్న కమిటి కాబట్టి దాని రిపోర్టు కూడా సుప్రింకోర్టుకే సమర్పించాలి. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వంలోని ఎవరిని కమిటి ముందుకు వచ్చి వివరాలు చెప్పమని కమిటీ అడిగినా నిరాకరించేందుకు లేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంలో కేంద్ర హోంశాఖ, ఐటీ, విదేశీ వ్యవహారాల శాఖలకు భాగస్వామ్యం ఉందని అనుకుంటున్నారు. కాబట్టి తొందరలోనే విచారణను ముగించి సుప్రింకోర్టు మోడికి గట్టి షాకే ఇచ్చేట్లుంది.

This post was last modified on September 24, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ డే – కంటెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం

టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…

2 hours ago

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

3 hours ago

పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?

రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…

3 hours ago

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

6 hours ago

అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

9 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

10 hours ago