Political News

జ‌గ‌న్ స‌ర్కారుకు సుప్రీం రూ. లక్ష జరిమానా..

ఏపీ స‌ర్కారు కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స‌ర్కారుకు.. ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాల్లో ఇది తార‌స్థాయికి చేరింది. వాస్త‌వానికి ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌పై కూడా హైకోర్టు 24 గంట‌ల కింద‌టే.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా తిరుమ‌ల తిరుప‌తి బోర్డు నియామ‌కాల‌పై నిప్పులు చెరిగింది. ఇదేమ‌న్నా.. సొంత జాగీరా.. అంటూ.. ప్ర‌శ్నించింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను నియ‌మిస్తూ.. ఇచ్చిన జీవోను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. ఇక‌, ఈ రోజు(గురువారం) ఉద‌యం కూడా హైకోర్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దాడి చేయ‌డం.. దీనిని టీడీపీ నాయ‌కులు నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌రిగిన ర‌గ‌డ‌తోపాటు.. డీజీపీ కార్యాల‌యం వ‌ద్ద కూడా టీడీపీ నేత‌ల‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. అయితే ఇంత జ‌రిగినా.. టీడీపీ నేత‌ల‌పై పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. వారిపై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్ట‌డంతో త‌మ్ముళ్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఆకేసులోనూ.. స‌ర్కారుకు షాక్ ఇస్తూ.. హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీడీపీ నేత‌ల‌పై పెట్టిన కేసుల‌పై విచార‌ణ నిలిపి వేసి.. సెక్ష‌న్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వారి నుంచి వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. పోలీసుల‌కు సూచించింది.

అంటే.. హైకోర్టు స‌ర్కారు దూకుడుకు గ‌ట్టిగానే షాకిచ్చింద‌న్న‌మాట‌. ఇక‌, ఇప్పుడు ఇదే రోజు.. సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కారుకు మ‌రింత ప‌రాభ‌వం ఎదురైంది.. ఏకంగా.. ఇక్క‌డ జ‌రిమానా కొర‌డా ప‌డింది. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన సుప్రీం కోర్టు.. జ‌రిమానా క‌ట్టాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. విష‌యం ఏంటంటే.. దేవి సీఫుడ్స్‌ లిమిటెడ్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. దీంతో ఒకే రోజు రెండు కేసులు.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు కేసుల్లో కోర్టుల నుంచి ఏపీ ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఎదురు ద‌బ్బ‌లు త‌గిలించుకుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 23, 2021 2:17 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago