Political News

జ‌గ‌న్ స‌ర్కారుకు సుప్రీం రూ. లక్ష జరిమానా..

ఏపీ స‌ర్కారు కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స‌ర్కారుకు.. ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాల్లో ఇది తార‌స్థాయికి చేరింది. వాస్త‌వానికి ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌పై కూడా హైకోర్టు 24 గంట‌ల కింద‌టే.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా తిరుమ‌ల తిరుప‌తి బోర్డు నియామ‌కాల‌పై నిప్పులు చెరిగింది. ఇదేమ‌న్నా.. సొంత జాగీరా.. అంటూ.. ప్ర‌శ్నించింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను నియ‌మిస్తూ.. ఇచ్చిన జీవోను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. ఇక‌, ఈ రోజు(గురువారం) ఉద‌యం కూడా హైకోర్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దాడి చేయ‌డం.. దీనిని టీడీపీ నాయ‌కులు నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌రిగిన ర‌గ‌డ‌తోపాటు.. డీజీపీ కార్యాల‌యం వ‌ద్ద కూడా టీడీపీ నేత‌ల‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. అయితే ఇంత జ‌రిగినా.. టీడీపీ నేత‌ల‌పై పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. వారిపై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్ట‌డంతో త‌మ్ముళ్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఆకేసులోనూ.. స‌ర్కారుకు షాక్ ఇస్తూ.. హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీడీపీ నేత‌ల‌పై పెట్టిన కేసుల‌పై విచార‌ణ నిలిపి వేసి.. సెక్ష‌న్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వారి నుంచి వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. పోలీసుల‌కు సూచించింది.

అంటే.. హైకోర్టు స‌ర్కారు దూకుడుకు గ‌ట్టిగానే షాకిచ్చింద‌న్న‌మాట‌. ఇక‌, ఇప్పుడు ఇదే రోజు.. సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కారుకు మ‌రింత ప‌రాభ‌వం ఎదురైంది.. ఏకంగా.. ఇక్క‌డ జ‌రిమానా కొర‌డా ప‌డింది. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన సుప్రీం కోర్టు.. జ‌రిమానా క‌ట్టాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. విష‌యం ఏంటంటే.. దేవి సీఫుడ్స్‌ లిమిటెడ్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. దీంతో ఒకే రోజు రెండు కేసులు.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు కేసుల్లో కోర్టుల నుంచి ఏపీ ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఎదురు ద‌బ్బ‌లు త‌గిలించుకుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 23, 2021 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

1 hour ago

తమ్ముడితో హిట్టు కొడితే అన్నయ్యతో పక్కా

ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…

4 hours ago

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

5 hours ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

6 hours ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

6 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago