Political News

తెలంగాణలో తొలిసారి అత్యధిక కేసులు.. ఎందుకిలా?

ప్రపంచానికి షాకిస్తున్న మాయదారి మహమ్మారి వేగంగా కమ్మేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య పరిమితంగా ఉండటమే కాదు.. నియంత్రించే స్థాయిలో ఉందన్న మాట వినిపించేది. దీనికి తగ్గట్లే రోజువారీ కేసుల నమోదు కూడా తక్కువగానే ఉండేవి. అందుకు భిన్నంగా శుక్రవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైన విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనట్లుగా ఒక్కరోజులో తెలంగాణలో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 82 కేసులు నమోదు కావటం గమనార్హం. ఒకే రోజులో అత్యధిక కేసుల నమోదులో ఈ రెండు రికార్డులేనని చెబుతున్నారు. మొన్నటివరకూ తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పాజిటివ్ కేసులే నమోదు కానీ తీరుకు భిన్నంగా ఇప్పుడు ఒకటి అరా కేసులు వస్తుండటం గమనార్హం. ఇంతకీ ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదైనట్లు? దానికి కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా.. సౌదీ నుంచి వచ్చిన 64 మందికి కూడా పాజిటివ్ రావటం కొత్త తలనొప్పిగా మారింది. సరైన వీసాలు లేకుండా సౌదీలో దొరికిపోయిన పలువురిని ఆ దేశం వెనక్కి పంపేసింది. ఇలా పంపిన వారిలో ఎక్కువమంది పాజిటివ్ కేసులు కావటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

అంతేకాదు.. ఇతరరాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులతోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు రాగా.. రంగారెడ్డిలో 14 కేసులు.. మెదక్ లో రెండు.. సంగారెడ్డి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. ఖమ్మం జిల్లాలోనూ రెండు కేసులు నమోదు కావటం చూస్తే.. మొన్నటివరకూ నియంత్రణలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కట్టు తప్పుతోందా? అన్నది ప్రశ్నగా మారింది.

గడిచిన మూడు రోజుల్నే తీసుకుంటే కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. మే 27నుంచి వరుస పెట్టి నమోదవుతున్న పాజిటివ్ కేసులు వందకు తగ్గకపోవటం ఒక విశేషంగా చెప్పాలి. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతంలో ఒకటి అరా అన్నట్లు ఉండే మరణాలు.. ఇటీవల కాలంలో ప్రతి రోజు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.

ఇంతకీ.. ఇలాంటిపరిస్థితి కారణం ఏమిటన్నది చూస్తే.. లాక్ డౌన్ సడలించటం.. ప్రయాణాలు పెరగటం.. మొన్నటివరకూ జాగ్రత్తగా ఇంటికే పరిమితమైన వారు.. ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి రావటం కూడా కేసుల నమోదు ఎక్కువ కావటానికి కారణంగా చెబుతున్నారు.

This post was last modified on May 30, 2020 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 minutes ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

25 minutes ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

31 minutes ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

55 minutes ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

1 hour ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

2 hours ago