మహమ్మారి వైరస్ వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగం కూడా కుదేలైంది. షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు, రిలీజ్ లు ఆగిపోవడంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు…ఒకరేమిటి…సినీ రంగానికి చెందిన పలువురు లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో, షూటింగులకు అనుమతినివ్వాలని సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఈ విషయంపై చిరంజీవి ఇంట్లో నాగార్జునతో పాటు మరికొందరు సినీ ప్రముఖులతో తలసాని భేటీ అయ్యారు.
అడిగిన వెంటనే సినీ ఇండస్ట్రీ సమస్యలపై స్పందించిన తలసానికి ఇపుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ భేటీకి తనను పిలవలేదని…చర్చలపేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బాలకృష్ణ చేసిన విమర్శలు దుమారం రేపాయి. దీంతో, తలసాని ఆ భేటీపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తాము ఎవరినీ ప్రత్యేకంగా పిలవలేదని….షూటింగుల్లో సడలింపుల విషయంలో కొంతమంది యాక్టివ్ గా ఉన్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపామని తలసాని అన్నారు. కావాలంటే మరోసారి ఇండస్ట్రీలోని అందరినీ పిలిచి మీటింగ్ పెడతామని చెప్పారు. దీంతో, ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే తలసానికి చెడు ఎదురైందని నెటిజన్లు అనుకుంటున్నారు. నారీ నారీ నడుమ మురారి తరహాలో…హీరో…హీరో నడుమ తలసాని అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శిస్తున్నారు.
ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఉన్న ఇగో క్లాషెస్ కరోనా టైంలోనూ వీడడం లేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి…లాక్ డౌన్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు ఎలా జరుపుకుందామని చర్చించుకోవాల్సింది పోయి,ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఈ తరహాలో రచ్చ చేసుకుంటే….ప్రభుత్వం అసలు అనుమతులే ఇవ్వకుండా పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మరి, ఇప్పటికైనా ఇగోను వీడి మన హీరోలు ఒక మాట మీద నిలబడితే మంచిదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
This post was last modified on May 30, 2020 2:19 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…