మహమ్మారి వైరస్ వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగం కూడా కుదేలైంది. షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు, రిలీజ్ లు ఆగిపోవడంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు…ఒకరేమిటి…సినీ రంగానికి చెందిన పలువురు లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో, షూటింగులకు అనుమతినివ్వాలని సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఈ విషయంపై చిరంజీవి ఇంట్లో నాగార్జునతో పాటు మరికొందరు సినీ ప్రముఖులతో తలసాని భేటీ అయ్యారు.
అడిగిన వెంటనే సినీ ఇండస్ట్రీ సమస్యలపై స్పందించిన తలసానికి ఇపుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ భేటీకి తనను పిలవలేదని…చర్చలపేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బాలకృష్ణ చేసిన విమర్శలు దుమారం రేపాయి. దీంతో, తలసాని ఆ భేటీపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తాము ఎవరినీ ప్రత్యేకంగా పిలవలేదని….షూటింగుల్లో సడలింపుల విషయంలో కొంతమంది యాక్టివ్ గా ఉన్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపామని తలసాని అన్నారు. కావాలంటే మరోసారి ఇండస్ట్రీలోని అందరినీ పిలిచి మీటింగ్ పెడతామని చెప్పారు. దీంతో, ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే తలసానికి చెడు ఎదురైందని నెటిజన్లు అనుకుంటున్నారు. నారీ నారీ నడుమ మురారి తరహాలో…హీరో…హీరో నడుమ తలసాని అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శిస్తున్నారు.
ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఉన్న ఇగో క్లాషెస్ కరోనా టైంలోనూ వీడడం లేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి…లాక్ డౌన్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు ఎలా జరుపుకుందామని చర్చించుకోవాల్సింది పోయి,ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఈ తరహాలో రచ్చ చేసుకుంటే….ప్రభుత్వం అసలు అనుమతులే ఇవ్వకుండా పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మరి, ఇప్పటికైనా ఇగోను వీడి మన హీరోలు ఒక మాట మీద నిలబడితే మంచిదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
This post was last modified on May 30, 2020 2:19 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…