Movie News

హీరోల ఇగోలకు తలసాని బలయ్యారుగా

మహమ్మారి వైరస్ వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగం కూడా కుదేలైంది. షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు, రిలీజ్ లు ఆగిపోవడంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు…ఒకరేమిటి…సినీ రంగానికి చెందిన పలువురు లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో, షూటింగులకు అనుమతినివ్వాలని సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఈ విషయంపై చిరంజీవి ఇంట్లో నాగార్జునతో పాటు మరికొందరు సినీ ప్రముఖులతో తలసాని భేటీ అయ్యారు.

అడిగిన వెంటనే సినీ ఇండస్ట్రీ సమస్యలపై స్పందించిన తలసానికి ఇపుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ భేటీకి తనను పిలవలేదని…చర్చలపేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బాలకృష్ణ చేసిన విమర్శలు దుమారం రేపాయి. దీంతో, తలసాని ఆ భేటీపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

తాము ఎవరినీ ప్రత్యేకంగా పిలవలేదని….షూటింగుల్లో సడలింపుల విషయంలో కొంతమంది యాక్టివ్ గా ఉన్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపామని తలసాని అన్నారు. కావాలంటే మరోసారి ఇండస్ట్రీలోని అందరినీ పిలిచి మీటింగ్ పెడతామని చెప్పారు. దీంతో, ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే తలసానికి చెడు ఎదురైందని నెటిజన్లు అనుకుంటున్నారు. నారీ నారీ నడుమ మురారి తరహాలో…హీరో…హీరో నడుమ తలసాని అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శిస్తున్నారు.

ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఉన్న ఇగో క్లాషెస్ కరోనా టైంలోనూ వీడడం లేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి…లాక్ డౌన్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు ఎలా జరుపుకుందామని చర్చించుకోవాల్సింది పోయి,ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఈ తరహాలో రచ్చ చేసుకుంటే….ప్రభుత్వం అసలు అనుమతులే ఇవ్వకుండా పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మరి, ఇప్పటికైనా ఇగోను వీడి మన హీరోలు ఒక మాట మీద నిలబడితే మంచిదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

This post was last modified on May 30, 2020 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

38 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago