నోరా వీపుకు తేకే అన్నది వెనకటికి పెద్దల మాట..నోరు బాగుంటే ఊరు బాగుంటుందన్నది మరో మాట. ఈ రెండు మాటలు పాపం మెగా యాక్టర్ నాగబాబుకు తెలియదు అనుకోవాలి. అలాతెలిసి వుంటే ఈ అనవసరపు ఆవేశం ఆయనకు వుండేది కాదు. కానీ ఆవేశం ఎప్పుడు అనర్థదాయకమేగా. ఇప్పుడూ అదే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి చాలా ప్లాన్డ్ గా కష్టపడి, ఇండస్ట్రీ పెద్ద అనే ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసి, సిసిసి పెట్టి, కిందా మీదా పడి, అంతా అనుకూలంగా చేసుకుంటూవస్తే, ఒక్క దెబ్బకి మొత్తం మటాష్ చేసేసారు.
మెగాస్టార్ చిరంజీవి ఓ విభిన్న తరహా మనిషి. వీలయినంత వరకు కాంట్రావర్సీలకు దూరంగా వుండాలనుకుంటారు. వీలయినంత వరకు అందరి వాడిలా వుండాలనుకుంటారు. గట్టిగా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అనుకుంటే చాలు. ఆయన సైలంట్ అయిపోతారు.
ఇప్పుడు అదే జరిగే పరిస్థితి. బాలయ్య మీద వున్నట్లుండి ఆవేశపడిపోయారు నాగబాబు. బాలయ్య మాట జారి వుండొచ్చు. కానీ ఇక్కడ నాగబాబు గమనించాల్సింది అది ఒక్కటే కాదు, తను రెచ్చిపోతే, అన్న మెగాస్టార్ ఏమనుకుంటారు? ఆయన పరిస్థితి ఏమవుతుంది? అన్నది. అది గమనించలేదు. ఇప్పుడేమయింది. సీన్ రివర్స్ అయిపోయింది. బాలయ్యకు భయంకరంగా మద్దతు లభిస్తోంది. ఒక్కరంటే ఒక్కరు నాగబాబు కు మద్దతుగా మాట్లాడుతున్న దాఖలా కనిపించడం లేదు.
ఓ చిన్న డైరక్టర్ వీడియో లో మాటల తూటాలు విసిరాడు. ఇలా ఒకళ్లు కాదు అనేక మంది విడియోలు, ప్రకటనలు సోషల్ మీడియాలోకి వదిలారు. అందరూ మెగాస్టార్ ను తప్పు పట్టేవారే.
అసలు ఇంట్లో సమావేశం పెట్టడం ఏమిటి?
డిజాస్టర్లు ఇచ్చి, సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చున్న దర్శకుడిని దగ్గరకు తీయడం ఏమిటి? సిఎమ్ దగ్గరకు తీసుకెళ్లడం ఏమిటి?
మంత్రి తలసాని ట్రస్ట్ పంపిణీ చేసిన సరుకుల సంచీ మీద కేసిఆర్ ఫొటోతో పాటు మెగాస్టార్ చిత్రం కూడా దేనికి?
ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్లుగా మారాయి. ఇదే సమయంలో మెగాక్యాంప్ కు మద్దతుగా రంగంలోకి దిగిన వారు ఒక్కరు కనిపించడం లేదు. చిరంజీవి దగ్గరకు తీసిన కొరటాల శివ, రాజమౌళి, సి కళ్యాణ్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ ఇలా అనేక మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాలయ్య వాఖ్యలు ఖండించకపోవచ్చు కానీ, కనీసం మెగాస్టార్ కు మద్దుతుగా ఓ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.
బాలయ్య తరపున ఎవరో ఒకరు చోటా మోటా జనాలు మాట్లాడుతున్నట్లే, మెగా క్యాంప్ తరపున మాట్లాడేవరే కనిపించడం లేదు. దీంతో ప్రో బాలయ్య వాయిస్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ కార్నర్ అయిపోయింది.
This post was last modified on May 30, 2020 2:20 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…