నోరా వీపుకు తేకే అన్నది వెనకటికి పెద్దల మాట..నోరు బాగుంటే ఊరు బాగుంటుందన్నది మరో మాట. ఈ రెండు మాటలు పాపం మెగా యాక్టర్ నాగబాబుకు తెలియదు అనుకోవాలి. అలాతెలిసి వుంటే ఈ అనవసరపు ఆవేశం ఆయనకు వుండేది కాదు. కానీ ఆవేశం ఎప్పుడు అనర్థదాయకమేగా. ఇప్పుడూ అదే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి చాలా ప్లాన్డ్ గా కష్టపడి, ఇండస్ట్రీ పెద్ద అనే ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసి, సిసిసి పెట్టి, కిందా మీదా పడి, అంతా అనుకూలంగా చేసుకుంటూవస్తే, ఒక్క దెబ్బకి మొత్తం మటాష్ చేసేసారు.
మెగాస్టార్ చిరంజీవి ఓ విభిన్న తరహా మనిషి. వీలయినంత వరకు కాంట్రావర్సీలకు దూరంగా వుండాలనుకుంటారు. వీలయినంత వరకు అందరి వాడిలా వుండాలనుకుంటారు. గట్టిగా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అనుకుంటే చాలు. ఆయన సైలంట్ అయిపోతారు.
ఇప్పుడు అదే జరిగే పరిస్థితి. బాలయ్య మీద వున్నట్లుండి ఆవేశపడిపోయారు నాగబాబు. బాలయ్య మాట జారి వుండొచ్చు. కానీ ఇక్కడ నాగబాబు గమనించాల్సింది అది ఒక్కటే కాదు, తను రెచ్చిపోతే, అన్న మెగాస్టార్ ఏమనుకుంటారు? ఆయన పరిస్థితి ఏమవుతుంది? అన్నది. అది గమనించలేదు. ఇప్పుడేమయింది. సీన్ రివర్స్ అయిపోయింది. బాలయ్యకు భయంకరంగా మద్దతు లభిస్తోంది. ఒక్కరంటే ఒక్కరు నాగబాబు కు మద్దతుగా మాట్లాడుతున్న దాఖలా కనిపించడం లేదు.
ఓ చిన్న డైరక్టర్ వీడియో లో మాటల తూటాలు విసిరాడు. ఇలా ఒకళ్లు కాదు అనేక మంది విడియోలు, ప్రకటనలు సోషల్ మీడియాలోకి వదిలారు. అందరూ మెగాస్టార్ ను తప్పు పట్టేవారే.
అసలు ఇంట్లో సమావేశం పెట్టడం ఏమిటి?
డిజాస్టర్లు ఇచ్చి, సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చున్న దర్శకుడిని దగ్గరకు తీయడం ఏమిటి? సిఎమ్ దగ్గరకు తీసుకెళ్లడం ఏమిటి?
మంత్రి తలసాని ట్రస్ట్ పంపిణీ చేసిన సరుకుల సంచీ మీద కేసిఆర్ ఫొటోతో పాటు మెగాస్టార్ చిత్రం కూడా దేనికి?
ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్లుగా మారాయి. ఇదే సమయంలో మెగాక్యాంప్ కు మద్దతుగా రంగంలోకి దిగిన వారు ఒక్కరు కనిపించడం లేదు. చిరంజీవి దగ్గరకు తీసిన కొరటాల శివ, రాజమౌళి, సి కళ్యాణ్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ ఇలా అనేక మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాలయ్య వాఖ్యలు ఖండించకపోవచ్చు కానీ, కనీసం మెగాస్టార్ కు మద్దుతుగా ఓ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.
బాలయ్య తరపున ఎవరో ఒకరు చోటా మోటా జనాలు మాట్లాడుతున్నట్లే, మెగా క్యాంప్ తరపున మాట్లాడేవరే కనిపించడం లేదు. దీంతో ప్రో బాలయ్య వాయిస్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ కార్నర్ అయిపోయింది.
This post was last modified on May 30, 2020 2:20 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…