నోరా వీపుకు తేకే అన్నది వెనకటికి పెద్దల మాట..నోరు బాగుంటే ఊరు బాగుంటుందన్నది మరో మాట. ఈ రెండు మాటలు పాపం మెగా యాక్టర్ నాగబాబుకు తెలియదు అనుకోవాలి. అలాతెలిసి వుంటే ఈ అనవసరపు ఆవేశం ఆయనకు వుండేది కాదు. కానీ ఆవేశం ఎప్పుడు అనర్థదాయకమేగా. ఇప్పుడూ అదే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి చాలా ప్లాన్డ్ గా కష్టపడి, ఇండస్ట్రీ పెద్ద అనే ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసి, సిసిసి పెట్టి, కిందా మీదా పడి, అంతా అనుకూలంగా చేసుకుంటూవస్తే, ఒక్క దెబ్బకి మొత్తం మటాష్ చేసేసారు.
మెగాస్టార్ చిరంజీవి ఓ విభిన్న తరహా మనిషి. వీలయినంత వరకు కాంట్రావర్సీలకు దూరంగా వుండాలనుకుంటారు. వీలయినంత వరకు అందరి వాడిలా వుండాలనుకుంటారు. గట్టిగా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అనుకుంటే చాలు. ఆయన సైలంట్ అయిపోతారు.
ఇప్పుడు అదే జరిగే పరిస్థితి. బాలయ్య మీద వున్నట్లుండి ఆవేశపడిపోయారు నాగబాబు. బాలయ్య మాట జారి వుండొచ్చు. కానీ ఇక్కడ నాగబాబు గమనించాల్సింది అది ఒక్కటే కాదు, తను రెచ్చిపోతే, అన్న మెగాస్టార్ ఏమనుకుంటారు? ఆయన పరిస్థితి ఏమవుతుంది? అన్నది. అది గమనించలేదు. ఇప్పుడేమయింది. సీన్ రివర్స్ అయిపోయింది. బాలయ్యకు భయంకరంగా మద్దతు లభిస్తోంది. ఒక్కరంటే ఒక్కరు నాగబాబు కు మద్దతుగా మాట్లాడుతున్న దాఖలా కనిపించడం లేదు.
ఓ చిన్న డైరక్టర్ వీడియో లో మాటల తూటాలు విసిరాడు. ఇలా ఒకళ్లు కాదు అనేక మంది విడియోలు, ప్రకటనలు సోషల్ మీడియాలోకి వదిలారు. అందరూ మెగాస్టార్ ను తప్పు పట్టేవారే.
అసలు ఇంట్లో సమావేశం పెట్టడం ఏమిటి?
డిజాస్టర్లు ఇచ్చి, సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చున్న దర్శకుడిని దగ్గరకు తీయడం ఏమిటి? సిఎమ్ దగ్గరకు తీసుకెళ్లడం ఏమిటి?
మంత్రి తలసాని ట్రస్ట్ పంపిణీ చేసిన సరుకుల సంచీ మీద కేసిఆర్ ఫొటోతో పాటు మెగాస్టార్ చిత్రం కూడా దేనికి?
ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్లుగా మారాయి. ఇదే సమయంలో మెగాక్యాంప్ కు మద్దతుగా రంగంలోకి దిగిన వారు ఒక్కరు కనిపించడం లేదు. చిరంజీవి దగ్గరకు తీసిన కొరటాల శివ, రాజమౌళి, సి కళ్యాణ్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ ఇలా అనేక మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాలయ్య వాఖ్యలు ఖండించకపోవచ్చు కానీ, కనీసం మెగాస్టార్ కు మద్దుతుగా ఓ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.
బాలయ్య తరపున ఎవరో ఒకరు చోటా మోటా జనాలు మాట్లాడుతున్నట్లే, మెగా క్యాంప్ తరపున మాట్లాడేవరే కనిపించడం లేదు. దీంతో ప్రో బాలయ్య వాయిస్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ కార్నర్ అయిపోయింది.
This post was last modified on May 30, 2020 2:20 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…