నోరా వీపుకు తేకే అన్నది వెనకటికి పెద్దల మాట..నోరు బాగుంటే ఊరు బాగుంటుందన్నది మరో మాట. ఈ రెండు మాటలు పాపం మెగా యాక్టర్ నాగబాబుకు తెలియదు అనుకోవాలి. అలాతెలిసి వుంటే ఈ అనవసరపు ఆవేశం ఆయనకు వుండేది కాదు. కానీ ఆవేశం ఎప్పుడు అనర్థదాయకమేగా. ఇప్పుడూ అదే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి చాలా ప్లాన్డ్ గా కష్టపడి, ఇండస్ట్రీ పెద్ద అనే ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసి, సిసిసి పెట్టి, కిందా మీదా పడి, అంతా అనుకూలంగా చేసుకుంటూవస్తే, ఒక్క దెబ్బకి మొత్తం మటాష్ చేసేసారు.
మెగాస్టార్ చిరంజీవి ఓ విభిన్న తరహా మనిషి. వీలయినంత వరకు కాంట్రావర్సీలకు దూరంగా వుండాలనుకుంటారు. వీలయినంత వరకు అందరి వాడిలా వుండాలనుకుంటారు. గట్టిగా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. అనుకుంటే చాలు. ఆయన సైలంట్ అయిపోతారు.
ఇప్పుడు అదే జరిగే పరిస్థితి. బాలయ్య మీద వున్నట్లుండి ఆవేశపడిపోయారు నాగబాబు. బాలయ్య మాట జారి వుండొచ్చు. కానీ ఇక్కడ నాగబాబు గమనించాల్సింది అది ఒక్కటే కాదు, తను రెచ్చిపోతే, అన్న మెగాస్టార్ ఏమనుకుంటారు? ఆయన పరిస్థితి ఏమవుతుంది? అన్నది. అది గమనించలేదు. ఇప్పుడేమయింది. సీన్ రివర్స్ అయిపోయింది. బాలయ్యకు భయంకరంగా మద్దతు లభిస్తోంది. ఒక్కరంటే ఒక్కరు నాగబాబు కు మద్దతుగా మాట్లాడుతున్న దాఖలా కనిపించడం లేదు.
ఓ చిన్న డైరక్టర్ వీడియో లో మాటల తూటాలు విసిరాడు. ఇలా ఒకళ్లు కాదు అనేక మంది విడియోలు, ప్రకటనలు సోషల్ మీడియాలోకి వదిలారు. అందరూ మెగాస్టార్ ను తప్పు పట్టేవారే.
అసలు ఇంట్లో సమావేశం పెట్టడం ఏమిటి?
డిజాస్టర్లు ఇచ్చి, సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చున్న దర్శకుడిని దగ్గరకు తీయడం ఏమిటి? సిఎమ్ దగ్గరకు తీసుకెళ్లడం ఏమిటి?
మంత్రి తలసాని ట్రస్ట్ పంపిణీ చేసిన సరుకుల సంచీ మీద కేసిఆర్ ఫొటోతో పాటు మెగాస్టార్ చిత్రం కూడా దేనికి?
ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్లుగా మారాయి. ఇదే సమయంలో మెగాక్యాంప్ కు మద్దతుగా రంగంలోకి దిగిన వారు ఒక్కరు కనిపించడం లేదు. చిరంజీవి దగ్గరకు తీసిన కొరటాల శివ, రాజమౌళి, సి కళ్యాణ్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ ఇలా అనేక మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాలయ్య వాఖ్యలు ఖండించకపోవచ్చు కానీ, కనీసం మెగాస్టార్ కు మద్దుతుగా ఓ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.
బాలయ్య తరపున ఎవరో ఒకరు చోటా మోటా జనాలు మాట్లాడుతున్నట్లే, మెగా క్యాంప్ తరపున మాట్లాడేవరే కనిపించడం లేదు. దీంతో ప్రో బాలయ్య వాయిస్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ కార్నర్ అయిపోయింది.
This post was last modified on May 30, 2020 2:20 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…