మాటల్లో తడబాటు.. స్పష్టమైన ఉచ్ఛారణ లేకపోవటం.. పలికే మాటల్లో అన్వయ దోషాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మాజీ మంత్రి లోకేశ్ మాట్లాడుతుంటే.. రాజకీయ ప్రత్యర్థులు పండుగ చేసుకునే వారు. ఆయన ప్రెస్ మీట్ అయినంతనే.. ఆయన మాట్లాడిన మాటల్ని అసరాగా చేసుకొని మీమ్స్ మొదలు.. చిన్నిచిన్ని వీడియోల్ని చేసేవారు. అయితే.. అదంతా ఒకప్పుడు. చేతిలోని అధికారం చేజారిన తర్వాత.. లోకేశ్ రూపంలోనే కాదు.. మాటల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన విషయాల మీద ప్రిపేర్ అవుతున్నారు. మీడియా సమావేశాల్లో ఆయన మాట తీరులో తేడా కనిపిస్తోంది. తాజాగా హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావుపేటకు వెళుతుంటే.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే.
ఈ సందర్భంగా జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేశ్.. కీలకాంశాల్ని ప్రస్తావించారు. అన్నింటికి మించి.. ఆయన ఒక పాయింట్ చాలామందిని ఆకట్టుకుంటుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకూ ఆయన చెప్పిన ఆ కీలక పాయింట్ ఆయన మాటల్లో చూస్తే.. “దిశ చట్టం ఫేక్ చట్టం. దాన్ని తీసుకురాకుంటే.. నిర్భయ చట్టం కింద వీళ్లందరి పైన కేసు పెట్టి ఉంటే.. ఎవరైతే మహిళల మీద దాడి చేశారో.. వాళ్లందరూ జైల్లో ఉండే పరిస్థితి. బెయిల్ కూడా వచ్చి ఉండేది కాదు. కానీ.. ఈ రోజు బెయిల్ వచ్చిందంటే.. దానికి కారణం ఈ చేతకాని జగన్ రెడ్డి వల్లే. ముఖ్యమంత్రి.. డీజీపీని అడుగుతున్నా.. మీరిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు అన్నారే? చేతులు ఊపుతూ అన్నారే? 21 పని దినాల్లో శిక్ష పడుతుంది అని.. ఎస్.. దిస్ ఈజ్ ద జగన్ అని పెద్ద పెద్ద మాటలు అన్నారే? 150 మంది తోడు దొంగలు ఉన్నారే.. వారంతా చప్పట్లు కొట్టారు. శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఏమైందని అడుగుతున్నా? బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది” అని మండిపడ్డారు.
మీడియా సమావేశంలో ఆయన మాటల్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on September 10, 2021 2:34 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…