జ్యోతికుమారి.. ఈ మధ్య కాలంలో మీడియాలో సెన్సేషన్గా మారిన పేరు. లాక్ డౌన్ టైంలో ప్రజా రవాణా లేకపోవడంతో ఢిల్లీలోని గుర్గావ్ నుంచి బీహార్లోని సిరిహులి వరకు తన తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి తొక్కుకుంటూ వచ్చిందీ టీనేజీ అమ్మాయి. ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ఆమె సాహస యాత్ర సాగింది.
దీనిపై మీడియాలో వార్తలు రావడంతో జ్యోతి పేరు మార్మోగిపోయింది. ఆమె గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ట్వీట్ వేసింది. ఆమెకు సాయం చేయడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. భారత సైక్లింగ్ సమాఖ్య ఆమెకు శిక్షణ ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ఉదంతంతో జ్యోతి నేషనల్ సెలబ్రెటీ అయిపోయింది.
ఆమెను చూడటానికి రోజూ 40-50 మంది తన ఇంటికి వెళ్తున్నారట. తమది చిన్న ఇల్లు కావడం, కరోనా భయం కూడా ఉండటంతో జ్యోతి ఇంటి పక్కనే ఒక టెంట్ వేసి వచ్చిన అతిథుల్ని అందులోకి ఆహ్వానించి జ్యోతి వారితో ముచ్చటిస్తోందట. తాను అమ్మాయిని కాబట్టే తాను చేసిన సాహసానికి అంత గుర్తింపు వచ్చిందని జ్యోతి అంటోంది. తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తండ్రిని అంత దూరం తీసుకొచ్చానని.. లాక్ డౌన్ వల్ల ఎంతోమంది పరిస్థితి ఇలాగే ఉందని జ్యోతి చెప్పింది.
జ్యోతి కోసం ఉదయం ఏడు నుంచే తన ఇంటికి జనాలు వస్తున్నారు. రాత్రి ఎనిమిది వరకు ఇలా అతిథులతోనే ఆమె ఇల్లు నిండిపోతోంది. దీనిపై జ్యోతి తండ్రి మాట్లాడుతూ.. “మా ఇల్లు చాలా చిన్నది. అందుకే పక్కనే చిన్న టెంట్ వేశాం. వచ్చిపోయే వాళ్ల వల్ల కరోనా సోకుతుందన్న భయం ఉన్నప్పటికీ.. ఎవరినైనా రావొద్దని అంటే మాకు గర్వం వచ్చిందని అనుకుంటారు. అందుకే పక్కనే ఓ టెంట్ వేశాం. అందరూ అక్కడికి వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించొచ్చు’’ అని జ్యోతి తండ్రి మోహన్ పాసవాన్ అన్నాడు.
This post was last modified on May 30, 2020 10:01 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…