Political News

జనాలను ఖర్మానికి వదిలేసిన అమెరికా

ఆఫ్ఘనిస్ధాన్లోని జనాలను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసింది. సోమవారం అర్ధరాత్రి దేశంలో మిగిలిన అమెరకా పౌరులను, సైనికులను తీసుకుని లార్జ్ సీ-17 విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వెళ్ళిపోయింది. దీంతో ఆఫ్ఘన్లో అమెరికా పౌరుడు, సైనికులు టార్చిలైట్ వేసి వెతికినా ఇక కనబడరన్నట్లే. అందుకనే చివరి విమానం కాబూల్ నుండి ఎగిరిపోగానే తాలిబన్లు పండగ చేసుకున్నారు.

ఇప్పటికే అరాచకాలకు పాల్పడుతున్న తాలిబన్లకు అమెరికా సైన్యం కాబూల్ లోనే ఉండటంతో కొంత ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇకనుండి తాలిబన్ల అరాచకాలకు ఆఫ్ఘన్లో అడ్డన్నదే ఉండదని తేలిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఇపుడు యావత్ ప్రపంచం మూల్యం చెల్లించాల్సొస్తోంది. 20 ఏళ్ళు ఆప్ఘన్లో ఉన్న అమెరికా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే అది కేవలం తాలిబన్లకు మాత్రమే అని చెప్పాలి.

దేశంలో నుంచి అమెరికా సైన్యాన్ని అర్ధాంతరంగా ఉపసంహరించడం వల్ల యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, అత్యంత ఆధునికమైన ఆయుధాలు, యుద్ధాల్లో వాడే పటిష్టమైన సామర్ధ్యం కలిగిన వాహనాలు+70 టన్నుల తుపాకులు, బుల్లెట్, ఆయుధ సామగ్రి అక్కడే వదిలేయడంతో అవి తాలిబన్ల చేతికి చిక్కాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కాబూల్ విమానాశ్రయంలో ఉండిపోయిన కొన్ని విమానాలు, హెలికాప్టర్లను మాత్రం తాలిబన్లు ఉపయోగించటానికి వీల్లేకుండా నిర్వీర్యం చేసి వదిలేసినట్లు అమెరికా రక్షణశాఖ స్వయంగా ప్రకటించింది.

అమెరికా చేసిన పని వల్ల దేశంలోని జనాలంతా చావలేక, బతకలేక నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళల విషయంలో చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నారు. 20 ఏళ్ళల్లో అనుభవించిన స్వేచ్ఛను ఆఫ్ఘన్ దేశ ప్రజలు ఒక్కసారిగా కోల్పోయినట్లే. దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అమెరికానే కారణమంటూ తీవ్రంగా మండి పోతున్నారు జనాలు. దేశంలోని అరాచకం వల్ల ఒక బ్రెడ్ ప్యాకెట్ సుమారు మన కరెన్సీలో రూ. 7 వేలట.

డబ్బు లేని వాళ్ళే కాదు ఉన్నవారు కూడా ఆప్ఘన్లో ఒకే విధమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఆహార నిల్వలు అయిపోతున్నాయి. డబ్బులున్నా జనాలకు ఆహారం దొరకట్లేదట. బ్యాంకుల్లో డబ్బులేదు, షాపుల్లో ఆహారం లేదు. ఆసుపత్రుల్లో వైద్యం దొరకటం లేదు. ఉన్నదల్లా తాలిబన్ల చేతుల్లో ఆధునిక ఆయుధాలు మాత్రమే. కేవలం తాలిబన్ల ఫైటర్లకు మాత్రమే కావాల్సినంత ఆహారం, మందులు దొరుకుతున్నాయట. అందుకనే ప్రస్తుత తమ దుస్థితిని తలచుకుని దేశ ప్రజలు అమెరికాను శాపనార్ధాలు పెడుతున్నారు.

This post was last modified on September 2, 2021 1:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

5 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

6 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

7 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

9 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

9 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

9 hours ago