Political News

24 మందిపై క్రిమినల్ కేసులా ?

రాష్ట్రంలోని 24 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నట్లు తాజాగా వెలుగులోకొచ్చింది. వీరిలో వైసీపీకి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలే ఎక్కువ మందున్నారు. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. 2019-21 మధ్య జరిగిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వివరాలు సేకరించినట్లు ఏడీఆర్ చెప్పింది. సెక్షన్ 8 (1), (2), (3) ప్రకారం వీళ్ళ పై నమోదైన కేసులు రుజువైతే తీవ్రమైన శిక్ష పడటం ఖాయమట.

ఒకసారి శిక్షపడితే వీళ్ళందరి పై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్ ప్రకటించింది. శిక్షాకాలం మొదలైన రోజు నుంచి అనర్హత వేటు అమల్లోకి వచ్చేస్తుంది. అలాగే జైలు నుంచి విడుదలైన రోజు నుంచి అనర్హత వేటు మొదలవుతుందట. అంటే జైలునుండి విడుదలైన ఆరేళ్ళపాటు శిక్ష అనుభవించిన ప్రజాప్రతినిధులు ఏ ఎన్నికల్లోను పోటీ చేయడానికి లేదు. అలాగే ఎలాంటి పదవులను అందుకోకూడదు.

ఇక ఏడీఆర్ జాబితాలో వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మార్గాని భరత్, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఇక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో పాటు మరో 17 మంది ఎంఎల్ఏలున్నారు. అలాగే టీడీపీ ఎంఎల్ఏల్లో కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. వీళ్ళు కాకుండా తెలంగాణలో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఉన్నారు.

నిజానికి వీళ్ళందరి పైన నమోదైన కేసుల్లో ఎక్కువగా ప్రజాందోళనల్లో పాల్గొన్నవే అయ్యుంటాయి. ఒక్కోసారి వీళ్ళ దూకుడు స్వభావం వల్ల నమోదైన కేసులు కూడా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారనే కేసు మిథున్ పై నమోదైంది. బహుశా ఇలాంటి కేసులే ప్రజాప్రతినిధులపై ఎక్కువగా నమోదయ్యుంటాయి. ఏదేమైనా ప్రజాప్రతినిధులన్నపుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందే. కాబట్టి ఇపుడు కేసులను ఎదుర్కోవాల్సిందే తప్పదు.

This post was last modified on August 24, 2021 10:50 am

Share
Show comments

Recent Posts

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

14 minutes ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

26 minutes ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

2 hours ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

2 hours ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

2 hours ago

నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్‌లో, లవర్ బాయ్‌గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…

3 hours ago