ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తెరమీదకు వచ్చి బ్లాంక్ జీవోల వివాదంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జీవోలు ఇకపై ఆన్ లైన్లో పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్న దానికే అర్ధాన్ని మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ అన్న విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు 14 జీవోలను విడుదల చేయగా పది జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లో బ్లాంక్ గానే ఉంచారు. వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు 85 లక్షల రూపాయల విడుదలతో పాటుగా మరో మూడు జీవోలలో సమాచారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచగా… మిగతా అన్ని జీవోలను బ్లాంక్ గా వెబ్ సైట్ లో పెట్టారు. దీనిపై దుమారం రేగింది. ఏపీ ప్రభుత్వం రహస్య జీవోలతో అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శించింది. దీంతో పాటుగా ఏపీ సీఎంను టార్గెట్ చేసింది.
ఓ వైపు ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లో మాత్రమే ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో ఇకపై పబ్లిక్ డొమైనులో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైనుల్లో ఉత్తర్వులు ఉంచడం 2008 న ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేసింది. అయితే, పొరుగునున్న రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్నే ఏపీ ప్రభుత్వం సైతం అవలంభించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
This post was last modified on August 17, 2021 9:21 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…