రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెంచేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్ ఎక్కడా కనబడలేదు. ఉపఎన్నికలో తన స్టాండ్ ఏమిటో కూడా ఇంతవరకు జనసేన అధికారికంగా ప్రకటించలేదు. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీదు కానీ ఈ రోజే రేపో నోటిఫికేషన్ వచ్చేస్తోందన్నంతగా నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. అన్నీ పార్టీలు హుజూరాబాద్ కేంద్రంగా ఏదో కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇంతటి కీలక సమయంలో జనసేన పార్టీ ఉనికి కూడా ఎక్కడా కనబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఏపీలో బీజేపీ, జనసేనలు మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే. మరి తెలంగాణాలో ? ఇదే ఎవరికీ అర్ధం కావడం లేదు. బీజేపీతో తమకు పొత్తుందని జనసేన నేతలంటారు. కానీ జనసేనతో తమకు ఎలాంటి పొత్తులేదని స్వయంగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయే ప్రకటించారు. పొత్తులు లేకపోయినా గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను పోటీ చేయనీయకుండా బీజేపీ నేతలు విత్ డ్రా చేయించారు.
ఆ తర్వాత జరిగిన ఓ ఎంఎల్సీ ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన రామచంద్రరావును కాదని టీఆర్ఎస్ అభ్యర్ధి వాణికి ఓట్లేయమని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు లేదన్న విషయం బయటపడింది. అయితే ఆ తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేశాయి. అంటే ప్రతి ఎన్నికకు రెండు పార్టీలు ఒక్కోలా వ్యవహరిస్తున్నాయన్న విషయం అర్ధమైపోతోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసేన ను ఎవరు పట్టించుకోలేదు.
మరి తొందరలోనే జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో జనసేన స్టాండ్ ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. బీజేపీకి సహకారం అందిస్తుందా ? లేకపోతే దూరంగా ఉంటుందా అన్న విషయమై రెండు పార్టీల నేతల్లోను అయోమయం పెరిగిపోతోంది. అసలు జనసేన గురించి బీజేపీ నేతలు ఎందుకు ఆలోచిస్తోంది ? ఎందుకంటే బీజేపీ తరపున పోటీ చేయబోయే ఈటల రాజేందర్ గెలుపు అంత ప్రతిష్టాత్మకం కాబట్టే. ఈటలను ఓడించాలని కేసీయార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి కేసీయార్ ను తీరని దెబ్బకొట్టాలని ఈటల గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
వీరిద్దరి వ్యవహారం ఇలా ఉంటే మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా పోటీకి రెడీ అయిపోతున్నారు. అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక అందరికీ ఎంతటి ప్రిస్టేజ్ అయిపోయిందో అర్ధమవుతోంది. ఇలాంటి ఎన్నికలో పది ఓట్లు కూడా చాలా కీలకమే. కాబట్టే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి బీజేపీ నేతలు అంతలా ఆలోచిస్తున్నారు. చివరకు పవన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on August 15, 2021 11:23 am
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…