Political News

కాపు కోటలో ‘తోట’ బలాన్నే న‌మ్ముకున్న జ‌గ‌న్ ?


తూర్పు గోదావరి జిల్లా రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అంతు పట్టదు. ఇక్కడ ఉన్న వారి మనసులు వెన్న. వారికి సమాదరించే గుణం ఉంది. తమ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపరు. గోదారమ్మలా చల్లగా ఉంటారు. కోపం వస్తే అదే గోదారి తల్లిగా ఉగ్రరూపం దాలుస్తారు. వారు అందరినీ నమ్ముతారు. ఎన్ని ఎన్నికలు వచ్చినా నమ్మడం వారి నైజం. ఒకసారి మోసపోతే మాత్రం ఆ ఆవేశం వారి చేత ఏమైనా చేయిస్తుంది. మరి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అతి పెద్ద జనాభా కాపులు. వారు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి కొమ్ము కాశారు. కానీ వర్కౌట్ కాలేదు. అయితే ఆ ఎఫెక్ట్ టీడీపీపై ఘోరంగా ప‌డ‌డంతో టీడీపీ చిత్తు అయిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి, ప్ర‌జారాజ్యానికి నాలుగేసి సీట్లు వ‌చ్చాయి. అందుకే 2014 నాటికి టీడీపీకి జై అనేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి చోటిచ్చారు. తూర్పు తీర్పు ఎటో ఏపీ తీర్పు అటే అన్న నానుడి ఎప్పుడూ నిజ‌మ‌వుతూనే వ‌చ్చింది.

వచ్చే ఎన్నికల్లో వారి రూట్ ఎటూ అన్నదే చర్చగా ఉంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు నాయకులు వైసీపీ వైపు ఉండడం శ్రీరామ రక్ష అంటున్నరు. ఏపీలోని మొత్తం కాపులతో సఖ్యత కలిగిన తోట త్రిమూర్తులును జగన్ బాగానే మచ్చిక చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ పెద్ద పీట వేశారు. ఇదే గోదావరి జిల్లాకు చెందిన మంత్రి కురసాల కన్నబాబు ఉన్నా కూడా ఆయన రాజకీయంగా దూకుడు చేయలేరు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా త‌ర్వాత ఏవేవో కార‌ణాల‌తో ఆయ‌న సైలెంట్ అయిపోయార‌న్న‌ది వాస్త‌వం. క‌న్న‌బాబుతో పార్టీ మారి వ‌చ్చిన తోట‌కు మూడు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. అక్క‌డ కాపుల్లో ప‌ట్టుకోస‌మే మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తోటను జగన్ గట్టిగానే నమ్ముకున్నారు.

అయితే తోట కూడా కొన్ని సార్లు ఓడిన వారే. అంత వరకూ ఎందుకు 2019 ఎన్నికల్లో ఆయన ఓడిన తరువాతనే టీడీపీని వీడారు. అయితే ఆయనకు అంగబలం బాగా ఉంది. కాపు యువతలోనూ క్రేజ్ ఉంది. ఆయన పేరు చెబితే పలికే వారున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే కాపుల్లో నిమ్మకాయల చిన రాజప్ప, బండారు సత్యానంద‌రావు, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, నిమ్మల రామానాయుడు వంటి వారే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. అయితే టీడీపీకి జనసేనతో పొత్తు ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం మారే అవకాశం ఉందని అంటున్నారు.

అది కూడా గెలుపు అవకాశాలు టీడీపీకి ఉంటాయన్న నమ్మకం కుదిరితే కచ్చితంగా కాపులు అటు వైపు పెద్ద ఎత్తున మళ్ళుతారు. ఇపుడు చూస్తే అధికార వైసీపీ మీద కాపులలో పెద్ద ఎత్తున అసంతృప్తి అయితే లేదు. కానీ రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి కాపులకు ప్రత్యేకంగా నిధులు రాకపోయినా కాపు కార్పోరేషన్ కి మాట ఇచ్చినట్లుగా పదివేల కోట్ల రూపాయలను విడుదల చేయకపోయినా అది అధికార పార్టీకి దెబ్బ అవుతుంది అంటున్నారు. ఇక టీడీపీ – జ‌న‌సేన క‌లిసినా ఈ జిల్లాలో వైసీపీకి బ్యాండ్ ప‌డిపోద్ది. ఇవ‌న్నీ ఆలోచించే జ‌గ‌న్ కాపుల్లో మంచి ప‌ట్టుఉన్న‌ తోట త్రిమూర్తులుకు ఇక్క‌డ పెద్ద పీఠ వేస్తోన్న ప‌రిస్థితి ఉంది.

This post was last modified on August 8, 2021 2:55 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

3 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

6 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

8 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

9 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

9 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

10 hours ago