Political News

ప్రతిపక్షాల వ్యూహాత్మక నిర్ణయం ?

కొద్దిరోజులుగా పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు మండించిన పెగాసస్ మంటలు చల్లారిపోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది ప్రతిపక్షాల వ్యూహం చూస్తుంటే. పార్లమెంటులో పెగాసస్ సాఫ్ట్ వేర్ తో ప్రతిపక్ష్ నేతలతో పాటు ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా, గోల చేసినా ప్రధానమంత్రి నరేంద్రమోడి సమాధానం చెప్పటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు.

అందుకనే ప్రతిపక్షాలు తమ రూటు మార్చాలని డిసైడ్ చేసుకున్నాయట. సోమవారం ఇదే వషయమై సుప్రింకోర్టులో కేసు వేయాలని డిసైడ్ చేశాయట. తమ పోరాట వేదికను పార్లమెంటు నుండి సుప్రింకోర్టుకు మార్చటానికి ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇదే విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు ఇద్దరు జర్నలిస్టులు కూడా కేంద్రంపై కేసు వేసిన విషయం తెలిసిందే. వాళ్ళేసిన కేసులను ఆగస్టు మొదటివారం నుండి విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు.

ఇపుడు వాళ్ళదారిలోనే ప్రతిపక్షాల నేతలు కూడా వరుసగా సుప్రింకోర్టులో కేసులు వేయబోతున్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పకపోయినా సుప్రింకోర్టు విచారణలో అయితే కేంద్రం సమాధానం చెప్పి తీరాల్సిందే. పోరాట వేదికను సుప్రింకోర్టుకు మర్చాలని డిసైడ్ చేసిన తర్వాత ఇక ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏమి చేస్తాయి ? ఏం చేస్తాయంటే ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యాయి.

పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదల, నిత్యావసరాల ధరలు, కరోనా వైరస్ నియంత్రణలో కేంద్రం వైఫల్యాలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న శాంతి భద్రతల సమస్యల్లాంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీయటానికి ప్రతిపక్షాలు అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. సబ్జెక్టు మారినా పోరాటపంథాను మాత్రం వదిలిపెట్టేది లేదని ప్రతిపక్షాలు గట్టిగానే నిర్ణయించుకున్నాయి. మరి సమావేశాలు జరిగే మిగిలిన 11 రోజులు ఉభయసభల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on August 2, 2021 10:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: BJPOppsition

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago