Political News

ప్రతిపక్షాలకు బీజేపీ బుద్ధులు చెబుతోందా ?

‘సభను మార్కెట్లాగ మార్చేద్దామా’ ? ఇది తాజాగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను ఉద్దేశించి సంధించిన ప్రశ్న. గడచిన 12 రోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలు ఒకవైపు లోక్ సభలోను అలాగే ఇటు రాజ్యసభలో కూడా పెగాసస్ ఆరోపణలపై విచారణ చేయాలని, ప్రధానమంత్రి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే వీళ్ళ డిమాండ్ ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఉభయసభల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. శుక్రవారం రాజ్యసభను వాయిదా వేసేసమయంలో సభ్యుల గోలను ఉద్దేశించి ఛైర్మన్ వెంకయ్యనాయుడు పై వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదు. కానీ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు సభలో ఎలా వ్యవహరించిందనే విషయాన్ని మరచిపోయినట్లుంది.

యూపీఏ-2 ప్రభుత్వంలో 2 జీ స్పెక్ట్రమ్ వేలంపాటలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో కాగ్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా బీజేపీ సభ్యులు ఉభయసభల్లోను గోల మొదలుపెట్టారు. 2జీ స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, కాగ్ నివేదికంతా తప్పులే అని అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎంత మొత్తుకున్నా బీజేపీ వినిపించుకోలేదు. ఇలాగే సుమారు 20 రోజులపాటు ఉభయసభల్లో గందరగోళం సృష్టించింది. చివరకు సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు. ఇదే అంశంలో ప్రభుత్వం అప్పట్లో ఇద్దరు మంత్రులను, ఇద్దరు ఎంపిలపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేసింది. చివరకు సుప్రింకోర్టులో జరిగిన విచారణలో స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతే జరగలేదని తేలింది.

అంతకుముందు కూడా రక్షణరంగంలో కుంభకోణం జరిగిందంటు బీజేపీ ఎంపీలు నానా గోలచేశారు. అప్పుడు కూడా దాదాపు 40 రోజుల పాటు ఉభయసభలను సాగనీయలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే పార్లమెంటులో నానా గోల చేస్తుంది. అదే అధికారంలో ఉంటేమాత్రం పార్లమెంటు నిర్వహణపై ప్రతిపక్షాలకు బుద్ధులు చెబుతుంది. దీనికి వెంకయ్య కూడా మినహాయింపుకాదు. ఎందుకంటే దశాబ్దాలుగా రాజ్యసభ ఎంపిగా మాత్రమే కంటిన్యు అవుతున్న వెంకయ్య కూడా రాజ్యసభలో గోల చేసిన వ్యక్తే. మొత్తానికి బీజేపీ చరిత్రను మరచిపోయినట్లే ఉంది చూస్తుంటే.

This post was last modified on July 31, 2021 12:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago