Movie News

అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ ఫిర్యాదు!

ఓటీటీలో వచ్చే కంటెంట్ శృతిమించుతుందని దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ పై ఫిర్యాదు నమోదైంది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఆంథాలజీ షార్ట్ ఫిల్మ్ గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇందులో నటి శోభితా ధూళిపాళ నటించింది. అయితే ఓ సీన్ అవసరం లేకపోయినా.. డైరెక్టర్ తీశారంటూ శోభితా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఓ సీన్ లో నటి శోభితా పాత్రకు గర్భస్రావం అందుతుంది. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ చనిపోయిన బిడ్డను చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. నిజానికి ఆ సీన్ కథకు అవసరం లేదని.. అయినా మేకర్లు సీన్ తీశారని.. దాని వలన మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపినట్లు అవుతుందని జూలై 27న నమోదైన ఫిర్యాదులో శోభితా పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తారా..? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన రూల్స్ లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకు తెలియజేసినట్లు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్ ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బ తీయడం ఇలా వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీదైనా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్ ను హెచ్చరించింది. గతంలో ‘సేక్రెడ్ గేమ్స్’, ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్ ల కారణంగా నెట్ ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచింది.

This post was last modified on July 31, 2021 1:14 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అప్పుడు బాలీవుడ్‌పై విమర్శలు.. ఇప్పుడేమో

రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…

2 hours ago

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

4 hours ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

9 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

9 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

10 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

11 hours ago