Movie News

అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ ఫిర్యాదు!

ఓటీటీలో వచ్చే కంటెంట్ శృతిమించుతుందని దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ పై ఫిర్యాదు నమోదైంది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఆంథాలజీ షార్ట్ ఫిల్మ్ గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇందులో నటి శోభితా ధూళిపాళ నటించింది. అయితే ఓ సీన్ అవసరం లేకపోయినా.. డైరెక్టర్ తీశారంటూ శోభితా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఓ సీన్ లో నటి శోభితా పాత్రకు గర్భస్రావం అందుతుంది. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ చనిపోయిన బిడ్డను చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. నిజానికి ఆ సీన్ కథకు అవసరం లేదని.. అయినా మేకర్లు సీన్ తీశారని.. దాని వలన మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపినట్లు అవుతుందని జూలై 27న నమోదైన ఫిర్యాదులో శోభితా పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తారా..? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన రూల్స్ లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకు తెలియజేసినట్లు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్ ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బ తీయడం ఇలా వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీదైనా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్ ను హెచ్చరించింది. గతంలో ‘సేక్రెడ్ గేమ్స్’, ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్ ల కారణంగా నెట్ ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచింది.

This post was last modified on July 31, 2021 1:14 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

19 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

54 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

58 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago