Political News

ఈ ఇద్దరూ జిల్లాకు చేసిందేమీ లేదా.. ?

విశాఖ జిల్లా అనంగానే ఇద్దరు మాజీ మంత్రులు గుర్తుకువస్తారు. ఇక తెలుగుదేశం ఏలుబడి కూడా సుదీర్ఘంగా సాగింది. ఏకంగా 22 ఏళ్ల పాటు టీడీపీ ఉమ్మడి ఏపీని, విభజన ఏపీని ఏలింది. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎపుడు గెలిచినా కూడా మంత్రిగానే పనిచేసేవారు. ఆయన నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ, తరువాత చంద్రబాబు జమానాలోనూ కూడా కీలకమైన శాఖలు అన్నీ కూడా చేపట్టారు. అదే విధంగా విశఖ సిటీకి చెందిన మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా దాదాపుగా ఏడేళ్ళ పాటు మంత్రి కుర్చీలో ఉన్నారు.

ఆయన మొదటిగా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగెస్ ప్రభుత్వంలో ఓడరేవులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేశారు. అక్కడ రెండేళ్ల పాటు మంత్రిగా ఉన్న గంటా 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు గెలవడంతో ఆయనకు మళ్ళీ మంత్రి యోగం పట్టింది. ఈసారి మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కీలకమైన శాఖనే తీసుకున్నారు. ఇక గంటా మంత్రిగా జిల్లాలో ఉన్నారు అన్న మాటే కానీ తన శాఖల ద్వారా జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటి అంటే చెప్పలేరు. ఆయన వరసపెట్టి గెలుస్తున్నారు, రాజకీయంగా గట్టి పట్టు సాధించారు తప్ప మంత్రిగా తాను చేసిన సేవలు ఇవి అని చెప్పుకోవడానికి ఏమీ లేదని అంటారు.

ఎక్క‌డో ప్ర‌కాశం జిల్లా నుంచి వ‌చ్చిన గంటాను స్థానిక నేత‌ల‌ను కాద‌ని మ‌రీ జిల్లా వాసులు గెలిపిస్తున్నారు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా.. నియోజ‌క‌వ‌ర్గాలు మారినా కూడా జిల్లా, న‌గ‌ర జ‌నాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ఆ స్థాయిలో మాత్రం గంటా జిల్లాలో త‌న‌దైన మార్క్ అభివృద్ధి ప‌ని ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా చేయ‌లేదు. ఇదే విధంగా అయ్యన్నపాత్రుడు తీరు కూడా ఉంది. ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగానే కాదు, పంచాయతీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మొదట్లో ఎన్టీఆర్ హయాంలో టెక్నికల్ మినిస్టర్ గా ఉన్నపుడు జిల్లాకు పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకువచ్చారు.

ఆ తరువాత ఆయన అటవీ శాఖతో పాటు, అనేక శాఖలు చేపట్టినా కూడా జిల్లాకు ప్రత్యేకించి ఒరిగింది ఏమీ లేదనే జనాలు చెబుతారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఎంతసేపూ తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచన చేస్తూ వచ్చారు తప్ప జిల్లా ప్రగతి విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని అంటారు. పైగా వీరిలో వీరికి పొస‌గ‌క‌.. రాజ‌కీయంగా శ‌త్ర‌వులుగా మారి క‌ల‌హించుకుంటూ వ‌చ్చారు. అందుకే ఈ రోజు వారిది పూర్తిగా ఉనికి పోరాటంగా మారింది అంటున్నారు. మరి వైసీపీ మంత్రులు అయినా తమదైన ముద్ర వేయకపోతే రేపటి రోజున ఇలాగే సీన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

This post was last modified on July 30, 2021 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

5 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago