Political News

బ‌ద్వేల్‌ను టీడీపీ ఏం చేస్తుంది…?

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి.. అదిగో ఉప ఎన్నిక అన‌గానే.. ఇదిగో అభ్య‌ర్థి.. అంటూ.. నానా హ‌డావుడి చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కీల‌క‌మైన స్థానంపై మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా ఇది పార్టీకి.. వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు కూడా ప్ర‌తిష్టాత్మ‌కమే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు.

అదే.. క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ నాయ‌కుడు వెంక‌ట సుబ్బ‌య్య‌.. హ‌ఠాన్మ‌రణం చెందారు. దీంతో మ‌రో నెలలో దీనికి సంబందించి నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే..తిరుప‌తి పార్ల‌మెంటు స్థానంపై ఉన్న చాక‌చ‌క్యం, వ్యూహం ఇక్క‌డబాబుకు కొర‌వ‌డ్డాయ‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి తిరుప‌తి క‌న్నా కూడా బ‌ద్వేల్‌.. టీడీపీకి ఇప్పుడున్న ప‌రిస్థితిలో చాలా ప్ర‌తిష్టాత్మకం. జ‌గ‌న్‌పై పైచేయి సాధించాల‌న్నా.. ఆయ‌న సొంత జిల్లాలోనూ టీడీపీకి తిరుగులేద‌ని.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నా.. లేదా.. జ‌గ‌న్ విధానాల‌తో ఆయ‌న సొంత జిల్లా ప్ర‌జ‌లు కూడా వైసీపీకి దూర‌మ‌య్యార‌నే వాద‌న‌ను ప్ర‌జ‌ల‌కు వినిపించాల‌న్నా.. కూడా బ‌ద్వేల్ ఉప ఎన్నిక టీడీపీకి అత్యంత కీల‌క‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోనీ.. ఇక్క‌డ టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కసారి కూడా విజ‌యం ద‌క్కించుకోలేదా? అంటే.. అలాఏమీ లేదు. గ‌తంలో 1985, 1994, 1999 వ‌రుస‌ ఎన్నిక‌ల్లో బిజివేముల వీరారెడ్డి టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకుని పార్టీని అభివృద్ధి చేశారు.

అంటే.. రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఇప‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా బోణీ కొట్ట‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. ఇది బెట‌రే క‌దా! పైగా.. ఇక్క‌డ పార్టీకి కార్య‌క‌ర్త‌లు నేత‌లు కూడా ఉన్నారు. అయితే.. లేనిద‌ల్లా.. చిత్త‌శుద్ధి, స్థిర‌మైన నాయ‌క‌త్వం. గ‌డిచిన కొన్నాళ్లుగా చంద్ర‌బాబు ఇక్క‌డ నాయ‌కుల‌ను మారుస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇది వాద‌నే కాదు.. వాస్త‌వం కూడా. 2004లో కోనిరెడ్డి విజ‌య‌మ్మ‌, 2009లో ల‌క్కినేని చిన్న‌య్య‌, 2014లో ఎన్ డీ విజ‌య‌జ్యోతి, 2019లో ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌ల‌కు చంద్ర‌బాబు టికెట్లు కేటాయించారు. అంటే.. నాలుగు ఎన్నిక‌ల్లోనూ అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం పార్టీకి ఇబ్బందిగా మారింది.

ఇక‌, ఆయా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన త‌మ్ముళ్ల‌కు వ‌చ్చిన ఓట్లు చూస్తే.. 2004లో విజ‌య‌మ్మ‌.. 51 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకున్నారు. కేవ‌లం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో ల‌క్కినేని చిన్న‌య్య త్రిముఖ పోటీలో కూడా 41 వేల ఓట్లు సంపాయించుకున్నారు. 2014లో విజ‌య‌జ్యోతి.. ఏకంగా 68 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకుని సెకండ్ ప్లేస్‌కు వెళ్లారు.

2019లో రాజ‌శేఖ‌ర్‌.. 50 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకున్నారు. దీనిని గ‌మ‌నిస్తే.. టీడీపీకి ఓటుబ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ..నిల‌క‌డైన నేత‌ను నిల‌బెట్ట‌ని ఫ‌లితం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ను క‌నుక‌.. తిరుప‌తి మాదిరిగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకు సాగితే.. జ‌గ‌న్ కోట‌లో జెండా పాత‌డం.. చంద్ర‌బాబుకు తేలిక అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 28, 2021 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంట ఓడినా రచ్చ గెలుస్తున్న ఉస్తాద్

ఓజి హ్యాంగోవర్ గత ఏడాది బాగా ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఉస్తాద్ భగత్ సింగ్ దారుణంగా నిరాశ…

53 minutes ago

ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వని రేణు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో వివాదాస్పద, వైరల్ ప్రశ్నలు లేకుండా ఉండవు.…

1 hour ago

మాయాబజార్ పాటా కాపీయా?

తెలుగులో ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాట రిలీజైతే సంగీత ప్రియులు ఓవైపు దాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు ఆ సాంగ్…

2 hours ago

జ‌గ‌న్‌ని ఇలానే వ‌దిలేస్తే…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అంద‌రికీ తెలిసిందే. త‌ర‌చుగా ఎక్క‌డ అవ‌కాశం ఉన్నా..…

3 hours ago

బ్రెయిన్ లేక హనుమాన్ ను వదులుకుంది

సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు…

3 hours ago

ఇలా చేస్తే ఆంధ్రా యూనివర్సిటీ పరువు ఏం కావాలి?

కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…

5 hours ago