అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజే కౌశిక్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.10లక్షల జరిమానా విధించారు.
కౌశిక్ రెడ్డి.. ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు . ఈ నేపథ్యంలో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై నగర ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో భారీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
నిజానికి పార్టీలో చేరడానికి ముందు రోజే.. కౌశిక్ రెడ్డి ఈ ఫెక్సీలు ఏర్పాటు చేసినా.. పార్టీలో చేరిన తర్వాతే.. ఫైన్ విధించడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల విషయమై.. బుధవారం ఉదయం నుంచే విపక్ష నేతలు మీడియాలో.. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం ఆ తర్వాత.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత.. వాటిని తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
This post was last modified on July 22, 2021 11:09 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…