అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజే కౌశిక్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.10లక్షల జరిమానా విధించారు.
కౌశిక్ రెడ్డి.. ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు . ఈ నేపథ్యంలో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై నగర ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో భారీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
నిజానికి పార్టీలో చేరడానికి ముందు రోజే.. కౌశిక్ రెడ్డి ఈ ఫెక్సీలు ఏర్పాటు చేసినా.. పార్టీలో చేరిన తర్వాతే.. ఫైన్ విధించడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల విషయమై.. బుధవారం ఉదయం నుంచే విపక్ష నేతలు మీడియాలో.. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం ఆ తర్వాత.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత.. వాటిని తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
This post was last modified on July 22, 2021 11:09 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…