ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ రిలీఫ్ లభించింది. ఓఎంసీ చార్జిషీట్పై విచారణ ఆపాలని ఆమె వేసిన పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టును ఆదేశించింది.
సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని… మరో ఛార్జ్ షీట్ వేయబోమని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని చెప్పింది. అయితే మౌఖికంగా చెబితే సరిపోదని, లిఖితపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
దీంతో అప్పటి వరకు సీబీఐ కోర్టులో తనపై విచారణ ఆపాలని శ్రీలక్ష్మి కోరారు. వాదనలు వినిపించనందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే రూ.4వేలు జరిమానా విధించిందని అన్నారు. ఈనెల 12న వాదనలు వినిపించకపోవతే డిశ్చార్జ్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ కోర్టు తెలిపిందని చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on July 10, 2021 9:57 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…