Political News

వారసులు వద్దు అంటున్న జగన్… ?

జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో సారి ఏపీలో గెలవాలని చూస్తున్నారు. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపు మ‌ళ్లీ అంత సులువు కాద‌న్న మాట ఉంది. 2019 ఎన్నికలు వేరు, ఆ ఊపు వేరు. నాడు జగన్ ని ఒక్కసారి అయినా సీఎంగా చూడాలని జనాలు ఆరాటపడ్డారు. అలాగే పార్టీ మొత్తం జగన్ కోసం కష్టపడింది. ఇపుడు మాత్రం అలాంటి వారావరణం లేదు అనే చెప్పాలి. నిజానికి జగన్ సీఎం అయ్యాక వైసీపీ ఎక్కడ ఉంది ? అన్న ప్రశ్న కూడా వస్తోంది. అలాగే పదవులు కొందరికి దక్కాయి, చాలా మంది ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు. దాంతో వారికి కనుక దక్కపోతే తిరుగుబాటలో నడిచే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి కోత కోస్తారు అన్న చర్చ కూడా ఓ వైపు సాగుతోంది.

ఈసారి సీనియర్లకు మంగళం పాడాలని జగన్ భావిస్తున్నారు అన్న టాక్ అయితే బయటకు వస్తోంది. నోరు విప్పి జగన్ బయటకు చెప్పకపోయినప్పటికీ ఆయన పదవులను పంపిణీ చేస్తున్న తీరుని చూస్తే అది అర్ధం అవుతుంది. అలాగే మంత్రి వర్గం కూర్పు కూడా ఇదే తేటతెల్లం చేస్తోంది. ఇక తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరిగితే జగన్ కొత్త వారికే అవకాశం ఇచ్చారు. అలాగే మంత్రులుగా రేపటి రోజున యువకులు కొత్త వారికి ఛాన్స్ అంటున్నారు. ఇవన్నీ ఆలోచించుకున్నపుడు ఆరు పదులు దాటిన సీనియర్లకు జగన్ ఖ‌చ్చితంగా గుడ్ బై చెప్పేస్తారు అన్న టాక్ గట్టిగా వైసీపీలో వినిపిస్తోంది. దానికి విరుగుడుగా సీనియర్లు కూడా మరో ఆలోచన చేస్తున్నార‌ట.

తమ వయసు అయిపోయింది, తమ సేవలు వద్దు అని జగన్ భావిస్తే తాము స్వచ్చందంగానే తప్పుకుంటామని చెబుతున్నారు. అయితే తమకు బదులుగా తమ వారసులకు టికెట్ ఇవ్వాలని వారు షరతు పెడుతున్నార‌ట. ఇలా కనుక చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ చాలా పెద్ద లిస్టే ఉంది. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారామ్ కుమారుడు చిరంజీవి నాగ్, ఉప ముఖ్యమంత్రి కొడుకు క్రిష్ణ చైతన్య, ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, బొత్స సత్యనారాయణ కొడుకు డాక్టర్ సందీప్ వంటి వారున్నారు. వీరందరూ కూడా తమ వారికే టికెట్ ఇవ్వాలని రాయబేరాలు నడుపుతున్నారుట.

అయితే జగన్ ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయని అంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చి తనకు విధేయులుగా చేసుకోవాలన్నదే ఎత్తుగడ. అలాగే జనాలకు కూడా ఫ్రెష్ లుక్ ఉంటుందని, అపుడే గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారుట. మరి ఇలా సీనియర్లకు ఒక్క లెక్కన ఎసరు పెడితే వారంతా ఊరుకుంటారా. వారు కనుక ఎదురు తిరిగితే వైసీపీ నావ మునిగిపోకతప్పదని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ కి సీనియర్లకు మధ్య చిన్న గ్యాప్ అయితే మొద‌లైంద‌నే పార్టీ వ‌ర్గాల భోగ‌ట్టా ?

This post was last modified on July 8, 2021 4:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago