ఏపీలో మళ్లీ పదవుల కోలాహలం పుంజుకుంది. వైసీపీ నేతలు తమకుపదవి కావాలంటే.. తమకు కావాలని.. పోటీ పడుతున్నారు. ఇప్పటికే పదవులు దక్కక ఎదురు చూస్తున్న సీనియర్లతోపాటు.. కొత్తవారు కూడా నామినేటెడ్ పదవుల కోసం తాడేపల్లి ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులతోపాటు.. టీటీడీ పాలకమండలి చైర్మన్, శ్రీశైలం దేవస్థానం బోర్డు సహా ఇతర పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు ఉంటుందా? అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలకు తీపికబురు అందింది.
తాజాగా సీఎం జగన్ నామినేటెడ్ పదవులపై సమీక్ష నిర్వహించనున్నారనే విషయం తెలిసే సరికి ఈ పదవులు ఆశిస్తున్నవారితోపాటు.. తమ వారికి పదవులు ఇప్పించుకునేందుకు కొందరు మంత్రులు కూడా తాడేపల్లిలోనే మకాం వేశారు. టీటీడీ విషయాన్ని పక్కన పెడితే.. శ్రీశైలం దేవస్థానం చైర్మన్ సహా .. ఇతర కార్పొరేషన్ పదవుల రేసులో ఇద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఉండడం ఆసక్తిగా మారింది. వీరిలో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. సతీమణి కూడా ఉన్నారు.
ఇప్పటికే ఈ ఇద్దరు మంత్రలు సీఎం జగన్ నుంచి హామీ పొందినట్టు సమాచారం. విజయనగరం కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ఝాన్సీ పోటీపడుతున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన కుమార్తెను ఈ పీఠంపై కూర్చోబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీంతో మంత్రికి హామీ ఇచ్చినా.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వీరభద్రస్వామిని శాంతింపజేసేందుకు ఆయన కుమార్తె వైపు జగన్ మొగ్గు చూపుతారని తెలుస్తోంది. ఇక,శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి కోసం.. శిల్పా సోదరుల్లో పెద్దవాడైన శిల్పా మోహన్రెడ్డి ఎదురు చూస్తున్నారు.
గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరగా.. జగన్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబం నుంచి కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నామినేటెడ్ పదవుల వ్యవహారం వైసీపీలో కోలాహలంగా మారడం గమనార్హం.
This post was last modified on July 3, 2021 7:44 am
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…