కేబుల్ బిల్లుకు చెక్ పెట్టేలా.. చెల్లించే ప్రతి పైసాకు తగిన న్యాయం కలిగేలా ట్రాయ్ (భారత టెలికం నియంత్రణ సంస్థ) 2020 జనవరి ఒకటిన విడుదల చేసిన కొత్త టారిఫ్ ను బాంబే హైకోర్టు ఓకే చేసింది. కొత్త టారిఫ్ విధానంతో ఇంతకాలం బొకేలా పేరుతో బాదేస్తున్న చానళ్లకు షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం ఇప్పటివరకు రూ.130 చెల్లిస్తే 100 చానళ్లు ఉచితంగా చేసే వీలుండేది. ఆ వందలోనూ 36 డీడీ చానళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను మార్చి రూ.130కే 200 ఉచిత చానళ్లను ఎంపిక చేసుకోవటం మాత్రమే కాదు.. డీడీకి చెందిన 36 చానళ్లను అదనంగా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. మొత్తంగా 236 చానళ్లు ఇవ్వాల్సిందే.
అదే సమయంలో వినియోగదారుడు రూ.160 చెల్లిస్తే.. సర్వీస్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న మొత్తం ఉచిత చానళ్లను ఇవ్వాల్సి ఉంటుంది. బొకేలా మాయా జాలానికి చెక్ పెట్టేలా బాంబే హైకోర్టు తాజా తీర్పు ఉండటం గమనార్హం. ట్రాయ్ కొత్త నిబంధనల్ని సవాల్ చేస్తూ వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా పెద్ద పెద్ద చానళ్లు కోర్టును ఆశ్రయించాయి. అందులో సోనీ.. జీ లాంటి సంస్థలు ఉన్నాయి.
వీరు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ అంజాద్ సయ్యద్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ట్రాయ్ రూపొందించిన నిబంధనలు సరిగా ఉన్నాయని పేర్కొంది. పిటిషన్ దారులు పేర్కొన్నట్లుగా నిరంకుశంగా.. అహేతుకంగా లేవని తేల్చింది. అంతేకాదు.. ఒక భాషకు చెందిన చానళ్లు ఒకే వరుసలో ఉండాలని.. ఎమ్మెస్వోలు చానళ్లను తమకు తోచినట్లుగా.. ఆ మాటకు వస్తే ఇష్టం వచ్చినట్లుగా మార్చకూడదని తేల్చింది.
ఒకవేళ చానళ్లను నంబరును మార్చాలంటే ముందుగా ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సిందేనన్న కొత్త నిబందన సరైనదేనని తేల్చింది. కాకుంటే.. పిటిషన్ దారుల అభ్యర్థన మేరకు కొత్త నిబంధన అమలును మరో ఆరువారాల పాటు పొడిగించారు. కొత్త నిబంధనల్లో కీలకమైనవి.
This post was last modified on July 1, 2021 11:40 am
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…