Political News

ఇది మీ హక్కు.. రూ.130కే 200 చానళ్లు

కేబుల్ బిల్లుకు చెక్ పెట్టేలా.. చెల్లించే ప్రతి పైసాకు తగిన న్యాయం కలిగేలా ట్రాయ్ (భారత టెలికం నియంత్రణ సంస్థ) 2020 జనవరి ఒకటిన విడుదల చేసిన కొత్త టారిఫ్ ను బాంబే హైకోర్టు ఓకే చేసింది. కొత్త టారిఫ్ విధానంతో ఇంతకాలం బొకేలా పేరుతో బాదేస్తున్న చానళ్లకు షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం ఇప్పటివరకు రూ.130 చెల్లిస్తే 100 చానళ్లు ఉచితంగా చేసే వీలుండేది. ఆ వందలోనూ 36 డీడీ చానళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను మార్చి రూ.130కే 200 ఉచిత చానళ్లను ఎంపిక చేసుకోవటం మాత్రమే కాదు.. డీడీకి చెందిన 36 చానళ్లను అదనంగా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. మొత్తంగా 236 చానళ్లు ఇవ్వాల్సిందే.

అదే సమయంలో వినియోగదారుడు రూ.160 చెల్లిస్తే.. సర్వీస్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న మొత్తం ఉచిత చానళ్లను ఇవ్వాల్సి ఉంటుంది. బొకేలా మాయా జాలానికి చెక్ పెట్టేలా బాంబే హైకోర్టు తాజా తీర్పు ఉండటం గమనార్హం. ట్రాయ్ కొత్త నిబంధనల్ని సవాల్ చేస్తూ వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా పెద్ద పెద్ద చానళ్లు కోర్టును ఆశ్రయించాయి. అందులో సోనీ.. జీ లాంటి సంస్థలు ఉన్నాయి.

వీరు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ అంజాద్ సయ్యద్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ట్రాయ్ రూపొందించిన నిబంధనలు సరిగా ఉన్నాయని పేర్కొంది. పిటిషన్ దారులు పేర్కొన్నట్లుగా నిరంకుశంగా.. అహేతుకంగా లేవని తేల్చింది. అంతేకాదు.. ఒక భాషకు చెందిన చానళ్లు ఒకే వరుసలో ఉండాలని.. ఎమ్మెస్వోలు చానళ్లను తమకు తోచినట్లుగా.. ఆ మాటకు వస్తే ఇష్టం వచ్చినట్లుగా మార్చకూడదని తేల్చింది.

ఒకవేళ చానళ్లను నంబరును మార్చాలంటే ముందుగా ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సిందేనన్న కొత్త నిబందన సరైనదేనని తేల్చింది. కాకుంటే.. పిటిషన్ దారుల అభ్యర్థన మేరకు కొత్త నిబంధన అమలును మరో ఆరువారాల పాటు పొడిగించారు. కొత్త నిబంధనల్లో కీలకమైనవి.

  • బొకే సిస్టంలో కీలక మార్పులు. ఒక బొకేలో 10 చానళ్లు ఉండి.. ఆ చానళ్ల టోకు ధర రూ.30 అనుకుంటే.. సగటున ఒక్కో చానల్ ధర రూ.3 ఉన్నట్లు. అయితే.. ఇప్పటివరకు తమకు తోచినట్లుగా పాపులర్ చానల్ ధర ఉండేది. దీంతో.. మిగిలిన అన్ని చానళ్లు తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి తీరుకు చెక్ పెట్టి.. ఒక చానల్ ధర మూడు రెట్లకు మించి ఉండకూదు. అంటే.. రూ.9కి మించి ఉండొద్దన్న ట్రాయ్ నిబంధనను కొట్టేసింది.
  • బొకేలో ఉండే పే చానళ్లకు సంబంధించి ఒక చానల్ కు గరిష్ఠ ధర రూ.19లుగా ఉండేది. ఇప్పుడు అది కాస్తా రూ.12 తగ్గించారు. అంటే బొకేలో ఉండే ఏ చానల్ ధర రూ.12కు మించి ఉండకూడదు.
  • ఒకే ఇంట్లో రెండు కేబుల్ కనెక్షన్లు ఉంటే.. రెండో కనెక్షన్ కు నెట్ వర్క్.. క్యారేజ్ ఫీజులో 40 శాతం మాత్రమే వసూలు చేయాలి. దీంతో.. ఇంట్లో రెండు టీవీలు ఉన్న వారికి భారం తగ్గనుంది.

This post was last modified on July 1, 2021 11:40 am

Share

Recent Posts

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

1 hour ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

3 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

3 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

4 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

4 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

4 hours ago