కొత్తగా నియమితులైన తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు తనదైన స్టైల్లో తొందరలోనే హోరెత్తించేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నారా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాచారం వస్తోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావటం కోసం తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదాయాత్ర మొదలుపెట్టబోతున్నారట. గతంలో పాదయాత్రలు చేసిన దివంగత సీఎం వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి స్పూర్తితోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం.
రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించటం పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేతలకు అధిష్టానంతో పాటు జనాల్లో కూడా బలం అంతంతమాత్రమే. వాళ్ళకు చెప్పుకోతగ్గ బలం లేకపోయినా చెవిలో జోరిగల్లాగ 24 గంటలూ గోల చేస్తునే ఉంటారన్నది వాస్తవం. వీళ్ళే కాకుండా జనబలం ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు.
సో ఇలాంటి వ్యతిరేక నేతలను వదిలిపెట్టేసి తనతో కలిసివచ్చే నేతల మద్దతుతో ముందుకు సాగాలని రేవంత్ డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగానే పాదయాత్ర చేయటమే భేషైన మార్గంగా నిర్ణయించుకున్నారు. కేసీయార్ గద్దె దింపాలంటే గాంధీ భవన్లో కూర్చుంటే లాభం లేదన్న విషయం రేవంత్ కు బాగా తెలుసు. జనాల్లోకి వెళ్ళిపోయి మద్దతు కూడగట్టడం ఒకటే మార్గమని కొత్త అధ్యక్షుడు డిసైడయ్యారు.
అందుకనే 7వ తేదీన బాధ్యతలు తీసుకునే సందర్భంగా కానీ లేకపోతే తర్వాత కానీ తన పాదయాత్ర విషయాన్ని కొత్త అధ్యక్షుడు ప్రకటించబోతున్నారట. అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అంటే మొత్తం 33 జిల్లాలు పాదయాత్రలో కవర్ అయ్యేట్లుగా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ పాదయాత్రకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఖాయం. కాబట్టి ఎవరికిష్టమున్నా లేకపోయినా పాదయాత్రకు నేతలంతా మద్దతివ్వాల్సిందే. మొత్తానికి పాదయాత్రతో రేవంత్ తెలంగాణాను హోరెత్తించేందకు రెడీ అయిపోతున్నారు.
This post was last modified on July 1, 2021 11:28 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…