క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్లు కూడా పీసీసీ పగ్గాల కోసం బాగా ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే సీనియర్లందరినీ కాదని అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపింది. ఇక్కడే సమస్య మొదలైంది. పార్టీలో ఇంతమంది సీనియర్లను కాదని టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు అధ్యక్ష పదవిని కట్టబెట్టడంపై సీనియర్లలో చాలా మందే అధిష్ఠానంపై మండిపోతున్నారు.
ఈ కారణంతోనే చాలామంది సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నారట. నిజానికి పేరుకు సీనియర్లే కానీ పట్టుమని తమ జిల్లాల్లో తిరిగి మద్దతు కూడగట్టేంత సీన్ కూడా చాలామందికి లేదన్నది వాస్తవం. తమకు మద్దతుగా పదిమందిని కూడా కూడగట్టుకోలేకపోవటం మరో మైనస్. అయినా రాజకీయాల్లో ఇవన్నీ కామనే కాబట్టి చాలామంది తమకే పీసీసీ కావాలని ప్రయత్నాలు చేసుకున్నారు.
రేవంత్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపోయారు. జీవితంలో తాను ఇక పీసీసీ భవన్ మెట్లెక్కేది లేదని శపథం చేశారు. మరో సీనియర్ నేత, ఎన్నికల కమిటి ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, సీనియర్ నేత లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకే రాజీనామా చేసేశారు. మరి మిగిలిన నేతల్లో చాలామంది ఏమి చేస్తారనే విషయాన్ని వెయిట్ చేసి చూడాలి.
రేవంత్ తో పాటు కొందరు సీనియర్లను ఉపాధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్లు తదితర పోస్టుల్లో ఏఐసీసేనే నియమించింది. మరి ఆ పోస్టుల్లో వాళ్ళంతా హ్యాపీయేనా లేక అసంతృప్తితో ఉన్నారా అనేది జూలై 7వ తేదీకి తేలిపోతుంది. ఎందుకంటే ఈ రోజున అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకోబోతున్నారు కాబట్టి.
This post was last modified on June 30, 2021 9:44 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…