దేశం కాని దేశానికి వెళ్లటం వేరు. అక్కడ అత్యుత్తమ స్థానాలకు ఎంపిక కావటం అరుదైన విషయం. తాజాగా అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఒక యువకుడు వలస కార్మికుడిగా అమెరికాలో పని చేయటమే కాదు.. కొంతకాలానికి పోలీసు శాఖలో కీలకమైన పోలీస్ బాస్ పదవికి ఎంపిక కావటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మూలాలు ఉన్న మైఖేల్ కురువిల్లా.
మైఖేల్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో కార్మికుడిగా పని చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న మైఖేల్.. 2006లో బ్రూక్ షీల్డ్ పోలీస్ శాఖలో చేరారు. ఇందులో పదవిని చేపట్టిన తొలి మొదటి భారతీయ అమెరికన్ అతడే కావటం విశేషం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్ర శివారు ప్రాంతమైన బ్రూక్ ఫీల్డ్ తదుపరి పోలీస్ బాస్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఎడ్వర్డ్ పెట్రాక్ సిఫార్సు మేరకు మైఖేల్ నియామకం సాగింది. జులై 12న ఈ పదవిని చేపట్టనున్నారు. వలస కుటుంబ నేపథ్యం ఉన్న తనకు పోలీసు శాఖలో కీలక బాధ్యత అప్పగించటం సామాన్యమైన విషయం కాదన్నారు. తన వంతు కృషి తోనే తానీ స్థాయికి చేరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఏమైనా దేశం కాని దేశంలో.. తన సత్తా చాటిన మైఖేల్కు అభినందనలు తెలపాల్సిందే.
This post was last modified on June 30, 2021 10:50 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…