దేశం కాని దేశానికి వెళ్లటం వేరు. అక్కడ అత్యుత్తమ స్థానాలకు ఎంపిక కావటం అరుదైన విషయం. తాజాగా అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఒక యువకుడు వలస కార్మికుడిగా అమెరికాలో పని చేయటమే కాదు.. కొంతకాలానికి పోలీసు శాఖలో కీలకమైన పోలీస్ బాస్ పదవికి ఎంపిక కావటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మూలాలు ఉన్న మైఖేల్ కురువిల్లా.
మైఖేల్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో కార్మికుడిగా పని చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న మైఖేల్.. 2006లో బ్రూక్ షీల్డ్ పోలీస్ శాఖలో చేరారు. ఇందులో పదవిని చేపట్టిన తొలి మొదటి భారతీయ అమెరికన్ అతడే కావటం విశేషం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్ర శివారు ప్రాంతమైన బ్రూక్ ఫీల్డ్ తదుపరి పోలీస్ బాస్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఎడ్వర్డ్ పెట్రాక్ సిఫార్సు మేరకు మైఖేల్ నియామకం సాగింది. జులై 12న ఈ పదవిని చేపట్టనున్నారు. వలస కుటుంబ నేపథ్యం ఉన్న తనకు పోలీసు శాఖలో కీలక బాధ్యత అప్పగించటం సామాన్యమైన విషయం కాదన్నారు. తన వంతు కృషి తోనే తానీ స్థాయికి చేరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఏమైనా దేశం కాని దేశంలో.. తన సత్తా చాటిన మైఖేల్కు అభినందనలు తెలపాల్సిందే.
35 రోజులంటే థియేటర్ రన్ పరంగా చూసుకుంటే మంచి నెంబర్ అనిపిస్తుంది కానీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని…
వయస్సు కేవలం నెంబర్ మాత్రమే అనే పదం ఇప్పుడు చాలా మంది అలా ఈజీగా వాడేస్తున్నారు. పూర్వకాలంలో మనిషి దీర్ఘాయుష్సుతో…
కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం "టీఆర్ఎస్" పేరును…
నిన్న విడుదలైన సినిమాల్లో నాగబంధంకే రివ్యూలు, సోషల్ మీడియా టాక్స్ ఎక్కువ నెగటివ్ కనిపించాయి. కానీ అనూహ్యంగా గ్రౌండ్ లెవెల్…
నటుడిగా తనలో ఎంత వర్సటాలిటీ ఉందో సత్యదేవ్ చాలాసార్లు నిరూపించాడు. కాకపోతే తన కమర్షియల్ మార్కెట్ పెంచే దర్శకుడు ఇప్పటిదాకా…
అగ్ర నిర్మాత గా ఆదిత్య చోప్రాకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుఖ్ ఖాన్ కు 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే'…