దేశం కాని దేశానికి వెళ్లటం వేరు. అక్కడ అత్యుత్తమ స్థానాలకు ఎంపిక కావటం అరుదైన విషయం. తాజాగా అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఒక యువకుడు వలస కార్మికుడిగా అమెరికాలో పని చేయటమే కాదు.. కొంతకాలానికి పోలీసు శాఖలో కీలకమైన పోలీస్ బాస్ పదవికి ఎంపిక కావటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మూలాలు ఉన్న మైఖేల్ కురువిల్లా.
మైఖేల్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో కార్మికుడిగా పని చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న మైఖేల్.. 2006లో బ్రూక్ షీల్డ్ పోలీస్ శాఖలో చేరారు. ఇందులో పదవిని చేపట్టిన తొలి మొదటి భారతీయ అమెరికన్ అతడే కావటం విశేషం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్ర శివారు ప్రాంతమైన బ్రూక్ ఫీల్డ్ తదుపరి పోలీస్ బాస్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఎడ్వర్డ్ పెట్రాక్ సిఫార్సు మేరకు మైఖేల్ నియామకం సాగింది. జులై 12న ఈ పదవిని చేపట్టనున్నారు. వలస కుటుంబ నేపథ్యం ఉన్న తనకు పోలీసు శాఖలో కీలక బాధ్యత అప్పగించటం సామాన్యమైన విషయం కాదన్నారు. తన వంతు కృషి తోనే తానీ స్థాయికి చేరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఏమైనా దేశం కాని దేశంలో.. తన సత్తా చాటిన మైఖేల్కు అభినందనలు తెలపాల్సిందే.
This post was last modified on June 30, 2021 10:50 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…