Political News

నిమిషాల వ్యవధిలో మూడుసార్లు వ్యాక్సిన్..చివరకు..!

దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ వ్యాక్సినేషన్ సమయంలో పలు చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళకు కేవలం నిమిషాల వ్యవధిలో.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమెకు మూడు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా వేయించుకున్న తర్వాత.. తనకు నర్స్.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె తన భర్తతో చెప్పింది. దీంతో.. అది చాలా ప్రమాదం అని భావించిన ఆమె భర్త అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అతను థానే మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తుండటంతో.. వెంటనే ఈ విషయాన్ని తన పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. తన భార్య ఈ వ్యాక్సిన్ విషయంలో అవగాహన లేదని.. అందుకే.. నర్స్ మూడుసార్లు వ్యాక్సిన్ ఇవ్వడంతో తీసుకుందని అతను వాపోయాడు.

మూడు డోస్ ల వ్యాక్సిన్ తో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చిందని అతను చెప్పాడు. ఈ విషయం కాస్త సంబంధిత మెడికల్ అధికారులకు తెలియడంతో.. ఆమెను పరీక్షించారు. అయితే.. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని గుర్తించారు. అయితే.. రెండు, మూడు రోజుల తర్వాత ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.

This post was last modified on June 29, 2021 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

32 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago