Political News

నిమిషాల వ్యవధిలో మూడుసార్లు వ్యాక్సిన్..చివరకు..!

దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ వ్యాక్సినేషన్ సమయంలో పలు చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళకు కేవలం నిమిషాల వ్యవధిలో.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమెకు మూడు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా వేయించుకున్న తర్వాత.. తనకు నర్స్.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె తన భర్తతో చెప్పింది. దీంతో.. అది చాలా ప్రమాదం అని భావించిన ఆమె భర్త అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అతను థానే మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తుండటంతో.. వెంటనే ఈ విషయాన్ని తన పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. తన భార్య ఈ వ్యాక్సిన్ విషయంలో అవగాహన లేదని.. అందుకే.. నర్స్ మూడుసార్లు వ్యాక్సిన్ ఇవ్వడంతో తీసుకుందని అతను వాపోయాడు.

మూడు డోస్ ల వ్యాక్సిన్ తో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చిందని అతను చెప్పాడు. ఈ విషయం కాస్త సంబంధిత మెడికల్ అధికారులకు తెలియడంతో.. ఆమెను పరీక్షించారు. అయితే.. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని గుర్తించారు. అయితే.. రెండు, మూడు రోజుల తర్వాత ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.

This post was last modified on June 29, 2021 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 hour ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

5 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

6 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

7 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

7 hours ago