దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ వ్యాక్సినేషన్ సమయంలో పలు చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళకు కేవలం నిమిషాల వ్యవధిలో.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రకు చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమెకు మూడు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా వేయించుకున్న తర్వాత.. తనకు నర్స్.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె తన భర్తతో చెప్పింది. దీంతో.. అది చాలా ప్రమాదం అని భావించిన ఆమె భర్త అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అతను థానే మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తుండటంతో.. వెంటనే ఈ విషయాన్ని తన పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. తన భార్య ఈ వ్యాక్సిన్ విషయంలో అవగాహన లేదని.. అందుకే.. నర్స్ మూడుసార్లు వ్యాక్సిన్ ఇవ్వడంతో తీసుకుందని అతను వాపోయాడు.
మూడు డోస్ ల వ్యాక్సిన్ తో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చిందని అతను చెప్పాడు. ఈ విషయం కాస్త సంబంధిత మెడికల్ అధికారులకు తెలియడంతో.. ఆమెను పరీక్షించారు. అయితే.. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని గుర్తించారు. అయితే.. రెండు, మూడు రోజుల తర్వాత ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.
This post was last modified on June 29, 2021 6:21 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…