వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు.. విజయసాయిరెడ్డి మరోసారి.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ.. అశోక్ గజపతిరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు చేసిన విమర్శలను దాటి భారీ రేంజ్లో దుయ్యబట్టారు. గజపతులు బానిసలని.. బ్రిటీష్ వారి ఎంగిలి మెతుకుల కోసం ఎగబడ్డారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరుస ట్వీట్లతో సాయిరెడ్డి రెచ్చిపోయారు. ఒకవైపు.. సాయిరెడ్డిని నిలువరించాలంటూ.. క్షత్రియ సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నా.. సాయిరెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
అశోక్ గజపతి వంశ చరిత్రను ఉద్దేశించి విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయనగర రాజులు విదేశీయుల ఎంగిలి మెతుల కోసం ఎగబడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి వెలమ రాజులు పౌరుషానికి ప్రతీక అని.. విజయనగర రాజులు కుట్రదారులు, బానిసలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ట్వీట్స్ వైరల్గా మారుతున్నాయి.
‘‘తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక. ఫ్రెంచ్, బ్రిటిష్ వారితోపాటు పొరుగు రాజ్యం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారు గానీ, విజయరామ గజపతిలా విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదు.
హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచమిచ్చి బొబ్బిలి కోటపై దొంగదెబ్బ కొట్టాడు విజయరామ గజపతి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా ముత్తాత విజయరామలా మారాడు అశోక్. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడు. కానీ, నీ ఆటలు సాగవు అశోక్ . ఇది 18వ శతాబ్దం కాదు.
గజపతులంటే ప్రజల పక్షాన ఎన్నడూ నిలబడని మోతుబరి జమిందారులు. గోల్కొండ సుల్తానులు, తర్వాత నిజాం నవాబులకు బానిసలు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బ తీశారు. ప్రజలను పీడించి బ్రిటిష్ వారికి కప్పం కట్టే వారు ఈ గజపతులు. అని తీవ్ర విమర్శలు చేశారు. మరి దీనిపై క్షత్రియులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on June 25, 2021 9:57 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…