Political News

మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టెస్టు చేస్తే కొవిడ్ ఉందో లేదో చెప్పేస్తుందట

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు.

శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని జొప్పించకుండానే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఉండే వైరస్ ను గుర్తించటం ద్వారా కొత్త విధానం పని చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని చిలీకి చెందిన స్టార్టప్ ‘డయాగ్నోసిస్ బయోటెక్’ సంస్థ దీనికి సంబంధించిన యంత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో.. కరోనా ఉందా? లేదా? అన్నది కచ్ఛితంగా తేల్చవచ్చని చెబుతున్నారు. ఈ కొత్తవిధానానికి ‘పోస్ట్’ (ఫోన్ స్క్రీన్ టెస్టింగ్) అన్న పేరు పెట్టారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న విధానం ఖర్చుతో పాటు.. కొంత నొప్పి కలిగించేదిగా చెప్పాలి.స్వాబ్ టెస్టు కోసం ఒక పుల్లను ముక్కు లోపలి భాగంలోనూ.. గొంతు లోపల పెట్టి నమూనాను సేకరించాల్సిన అవసరం లేదు. కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాను వారి మొబైల్ స్క్రీన్ నుంచి సేకరించొచ్చు. ఈ కొత్త విధానాన్ని తాజాగా పరీక్షించారు. అనుమానితుల స్మార్ట్ ఫోన్ల నుంచి నమూనాను సేకరించి పరీక్షించారు. ఇందులోపాజిటివ్ గా తేలిన వారంతా తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కొవిడ్ బారిన పడినట్లుగా తేల్చారు. ఈ కొత్త విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

This post was last modified on June 25, 2021 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండ్‌ను ఇలాగే కదా గౌరవించాల్సింది

తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…

31 minutes ago

కోలీవుడ్ తుఫాను టాలీవుడ్డుకు పాకుతుందా

తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…

48 minutes ago

పెద్ది విధ్వంసానికి ఆకాశ‌మే హ‌ద్దు

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సంద‌డితో ఎంతో ఆశాజన‌కంగా మొద‌లైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ త‌ర్వాత ఎంత వెల‌వెల‌బోయిందో తెలిసిందే.…

2 hours ago

మారుమోగుతున్న ఏపీ సర్కారీ బడుల సత్తా

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…

3 hours ago

పవన్‌కు నాని ఎప్పుడూ మద్దతే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…

3 hours ago

ఆస్కార్ రూటు… ఇప్పుడు మరింత స్వీటు

భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…

3 hours ago