Political News

మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టెస్టు చేస్తే కొవిడ్ ఉందో లేదో చెప్పేస్తుందట

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు.

శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని జొప్పించకుండానే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఉండే వైరస్ ను గుర్తించటం ద్వారా కొత్త విధానం పని చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని చిలీకి చెందిన స్టార్టప్ ‘డయాగ్నోసిస్ బయోటెక్’ సంస్థ దీనికి సంబంధించిన యంత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో.. కరోనా ఉందా? లేదా? అన్నది కచ్ఛితంగా తేల్చవచ్చని చెబుతున్నారు. ఈ కొత్తవిధానానికి ‘పోస్ట్’ (ఫోన్ స్క్రీన్ టెస్టింగ్) అన్న పేరు పెట్టారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న విధానం ఖర్చుతో పాటు.. కొంత నొప్పి కలిగించేదిగా చెప్పాలి.స్వాబ్ టెస్టు కోసం ఒక పుల్లను ముక్కు లోపలి భాగంలోనూ.. గొంతు లోపల పెట్టి నమూనాను సేకరించాల్సిన అవసరం లేదు. కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాను వారి మొబైల్ స్క్రీన్ నుంచి సేకరించొచ్చు. ఈ కొత్త విధానాన్ని తాజాగా పరీక్షించారు. అనుమానితుల స్మార్ట్ ఫోన్ల నుంచి నమూనాను సేకరించి పరీక్షించారు. ఇందులోపాజిటివ్ గా తేలిన వారంతా తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కొవిడ్ బారిన పడినట్లుగా తేల్చారు. ఈ కొత్త విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

This post was last modified on June 25, 2021 12:15 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

5 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

7 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

7 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

9 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

12 hours ago