Political News

మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టెస్టు చేస్తే కొవిడ్ ఉందో లేదో చెప్పేస్తుందట

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు.

శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని జొప్పించకుండానే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఉండే వైరస్ ను గుర్తించటం ద్వారా కొత్త విధానం పని చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని చిలీకి చెందిన స్టార్టప్ ‘డయాగ్నోసిస్ బయోటెక్’ సంస్థ దీనికి సంబంధించిన యంత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో.. కరోనా ఉందా? లేదా? అన్నది కచ్ఛితంగా తేల్చవచ్చని చెబుతున్నారు. ఈ కొత్తవిధానానికి ‘పోస్ట్’ (ఫోన్ స్క్రీన్ టెస్టింగ్) అన్న పేరు పెట్టారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న విధానం ఖర్చుతో పాటు.. కొంత నొప్పి కలిగించేదిగా చెప్పాలి.స్వాబ్ టెస్టు కోసం ఒక పుల్లను ముక్కు లోపలి భాగంలోనూ.. గొంతు లోపల పెట్టి నమూనాను సేకరించాల్సిన అవసరం లేదు. కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాను వారి మొబైల్ స్క్రీన్ నుంచి సేకరించొచ్చు. ఈ కొత్త విధానాన్ని తాజాగా పరీక్షించారు. అనుమానితుల స్మార్ట్ ఫోన్ల నుంచి నమూనాను సేకరించి పరీక్షించారు. ఇందులోపాజిటివ్ గా తేలిన వారంతా తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కొవిడ్ బారిన పడినట్లుగా తేల్చారు. ఈ కొత్త విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

Satya

Recent Posts

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

7 minutes ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

20 minutes ago

ఫ్యామిలీ సినిమా… దున్నేస్తోంది

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…

1 hour ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై…

2 hours ago

ప్రదీప్ రంగనాథన్ రూటే వేరు

వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…

4 hours ago

116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ దర్శనం

116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…

5 hours ago