ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు.
శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని జొప్పించకుండానే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఉండే వైరస్ ను గుర్తించటం ద్వారా కొత్త విధానం పని చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని చిలీకి చెందిన స్టార్టప్ ‘డయాగ్నోసిస్ బయోటెక్’ సంస్థ దీనికి సంబంధించిన యంత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో.. కరోనా ఉందా? లేదా? అన్నది కచ్ఛితంగా తేల్చవచ్చని చెబుతున్నారు. ఈ కొత్తవిధానానికి ‘పోస్ట్’ (ఫోన్ స్క్రీన్ టెస్టింగ్) అన్న పేరు పెట్టారు.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న విధానం ఖర్చుతో పాటు.. కొంత నొప్పి కలిగించేదిగా చెప్పాలి.స్వాబ్ టెస్టు కోసం ఒక పుల్లను ముక్కు లోపలి భాగంలోనూ.. గొంతు లోపల పెట్టి నమూనాను సేకరించాల్సిన అవసరం లేదు. కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాను వారి మొబైల్ స్క్రీన్ నుంచి సేకరించొచ్చు. ఈ కొత్త విధానాన్ని తాజాగా పరీక్షించారు. అనుమానితుల స్మార్ట్ ఫోన్ల నుంచి నమూనాను సేకరించి పరీక్షించారు. ఇందులోపాజిటివ్ గా తేలిన వారంతా తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కొవిడ్ బారిన పడినట్లుగా తేల్చారు. ఈ కొత్త విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
This post was last modified on June 25, 2021 12:15 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…