తెలంగాణలో ఎయిర్ పోర్టు అంటే శంషాబాద్ ఎయిర్ పోర్టు మాత్రమే. కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే బేగంపేట ఎయిర్ పోర్టు మినహా మరెక్కడా లేవు. పక్కనే ఉన్న ఏపీలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పలు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. తిరుపతి.. కడప.. కర్నూలు.. విజయవాడ.. రాజమండ్రి.. కాకినాడ.. విశాఖపట్నంలో ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో హైదరాబాద్ మినహా మరెక్కడా ఎయిర్ పోర్టులు లేవు.
ఈ కొరతను తీర్చేందుకు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుల్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తొలుత దేశీయ అవసరాలు తీర్చేలా.. కాలక్రమంలో అంతర్జాతీయ సర్వీసులు తిరిగేందుకు వీలుగా ఎయిర్ పోర్టులను నిర్మించాలని భావిస్తున్నారు. టైర్ టూ సిటీస్ లో కొత్త ఎయిర్ పోర్టుల్ని నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పలు విభాగాలు వాటిని పరిశీలించి సానుకూల నివేదికలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చిన్నపట్టణాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఈ విమానాశ్రయాలకు భూసేకరణ.. విమానాశ్రయాల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నదిగా చెబుతున్నారు. అందుకే..ఖర్చు భారాన్ని తగ్గించుకోవటానికి ఫేస్ 1.. ఫేజ్ 2 పేరుతో ఎయిర్ పోర్టుల్ని నిర్మించనున్నారు.
ఫేజ్ 1లో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఫేజ్ 2లో భాగంగా విమానాశ్రాయాన్ని మరింత విస్తరించి.. పెద్ద విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. వరంగల్ లో మాత్రం ఫేజ్ 2 ప్రకారం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే.. ఆ నగరం వేగంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో.. ఒకేసారి భారీ ఎత్తున ఎయిర్ పోర్టును నిర్మించాలని భావిస్తున్నారు.
ఇప్పటికి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక విమానాశ్రయానికి మరో విమానాశ్రయానికి మధ్య దూరం 150కి.మీ. ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఈ కారణంతో మహబూబ్ నగర్ లో ఎయిర్ పోర్టు విషయంలో అభ్యంతరాలు వచ్చే వీలుందని చెబుతున్నారు. అయితే..శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్వహించే జీఎంఆర్ తో చర్చలు జరిపి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో నిర్మించాలని భావిస్తున్న ఎయిర్ పోర్టుకు మార్గం సుగమం చేయాలనుకుంటున్నారు.
భవిష్యత్తులో తెలంగాణలో ఏర్పాటు చేసే విమానాశ్రయాలు ఎక్కడంటే
This post was last modified on June 24, 2021 4:12 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…