క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో ఇటీవల కాలంలో తీవ్ర వివాదమైన ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ‘శీను-వాసంతి-లక్ష్మి’ మూవీతో ఫేమస్ అయిన.. నవనీత్కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గత ఎన్నికల్లో విజయం సాధించారు. పార్లమెంటులో గట్టి వాయిస్ కూడా వినిపించే నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. “మోడీ.. తన మనసులో మాటలు చెబుతున్నారు. కానీ, రైతుల మనసులో మాటలు కూడా వినిపించుకోండి. ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వినండి” అంటూ కొన్నాళ్ల కిందట పార్లమెంటులో కౌర్ చేసిన ప్రసంగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. అప్పట్లో ఎన్సీపీ టిక్కెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఇక, 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచారు. అయితే.. అమరావతి ఎస్సీ నియోజకవర్గం నుంచి కౌర్పై పోటీ చేసి ఓడిపోయిన శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్.. కౌర్ ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని, తప్పుడు కులధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. సంచలన నిర్ణయం తీసుకుంది.
కౌర్ క్యాస్ట్ సర్టిఫికెట్ను రద్దు చేయడంతోపాటు.. రూ.2 లక్షల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు తీర్పు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక, దీనిపై సుప్రీంకు వెళ్లిన కౌర్కు తాజాగా ఉపశమనం లభించింది. సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు నిలుపుదల చేశారు. అయితే.. పూర్తిస్థాయి విచారణ మాత్రం జరగనుందని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా అమరావతిలో కౌర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక, న్యాయం గెలిచిందని.. తప్పుడు ఆరోపణలు పటాపంచలు అయిపోయాయని కౌర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on June 22, 2021 9:41 pm
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…