క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో ఇటీవల కాలంలో తీవ్ర వివాదమైన ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ‘శీను-వాసంతి-లక్ష్మి’ మూవీతో ఫేమస్ అయిన.. నవనీత్కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గత ఎన్నికల్లో విజయం సాధించారు. పార్లమెంటులో గట్టి వాయిస్ కూడా వినిపించే నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. “మోడీ.. తన మనసులో మాటలు చెబుతున్నారు. కానీ, రైతుల మనసులో మాటలు కూడా వినిపించుకోండి. ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వినండి” అంటూ కొన్నాళ్ల కిందట పార్లమెంటులో కౌర్ చేసిన ప్రసంగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. అప్పట్లో ఎన్సీపీ టిక్కెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఇక, 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచారు. అయితే.. అమరావతి ఎస్సీ నియోజకవర్గం నుంచి కౌర్పై పోటీ చేసి ఓడిపోయిన శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్.. కౌర్ ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని, తప్పుడు కులధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. సంచలన నిర్ణయం తీసుకుంది.
కౌర్ క్యాస్ట్ సర్టిఫికెట్ను రద్దు చేయడంతోపాటు.. రూ.2 లక్షల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు తీర్పు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక, దీనిపై సుప్రీంకు వెళ్లిన కౌర్కు తాజాగా ఉపశమనం లభించింది. సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు నిలుపుదల చేశారు. అయితే.. పూర్తిస్థాయి విచారణ మాత్రం జరగనుందని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా అమరావతిలో కౌర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక, న్యాయం గెలిచిందని.. తప్పుడు ఆరోపణలు పటాపంచలు అయిపోయాయని కౌర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on June 22, 2021 9:41 pm
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…