Political News

ట్విట్టర్ పై వేటు తప్పదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా కేంద్ర్రప్రభుత్వానికి, సోషల్ మీడియా నెట్ వర్క్ యాజమాన్యాలకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఏ సోషల్ నెట్ వర్కయినా దేశ చట్టాలకు లోబడే పనిచేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా యాజమాన్యాలు మనదేశ చట్టాలను అంగీకరించాయి. అయితే ట్విట్టర్ మాత్రం అంతిమంగా తమ విధానాలే తమకు ముఖ్యమని వాదిస్తోంది.

ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్ధాయిసంఘంతో ట్విట్టర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన భేటీలో ట్విట్టర్ ప్రతినిధులు తమ వాదనకే కట్టుబడున్నట్లు సమాచారం. ఒకవైపు భారతీయ చట్టాలను తాము గౌరవిస్తామని చెబుతునే మరోవైపు అంతిమంగా తమ విదానాలే తమకు ముఖ్యమని కూడా చెప్పటమే విచిత్రంగా ఉంది.

ట్విట్టర్ ప్రతినిధుల సమాధానాలను విశ్లేషించిన సంఘంలోని ఎంపిలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. భారత్ చట్టాలంటే ట్వట్టర్ ప్రతినిధులు లెక్కలేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. భారత్ లో ట్విట్టర్ కంటిన్యు అవ్వాలంటే ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాల్సిందే అన్న విషయాన్ని పార్టీలకు అతీతంగా సంఘంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా తేల్చిచెప్పారు.

సంఘంలోని సభ్యులు ఇంత గట్టిగా హెచ్చరించినా ట్విట్టర్ ప్రతినిధులు మాత్రం తమ వాదనకే కట్టుబడున్నారట. దాంతో సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల స్ధాయి, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళకున్న అధికారాలను రాతమూలకంగా తెలియజేయాలని ఆదేశించింది. సంఘం అడిగిన చాలా ప్రశ్నలకు ట్విట్టర్ డొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చిందట. ట్విట్టర్ ప్రతినిధుల వరస చూస్తుంటే కేంద్రప్రభుత్వంతో ఢీ కొనటానికే రెడీ అయినట్లు అనుమానంగా ఉంది. మరి ఇదే నిజమైతే కేంద్రాన్ని కాదని ట్విట్టర్ భారత్ లో మనగలదా ?

This post was last modified on June 19, 2021 7:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

3 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

3 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago