క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా కేంద్ర్రప్రభుత్వానికి, సోషల్ మీడియా నెట్ వర్క్ యాజమాన్యాలకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఏ సోషల్ నెట్ వర్కయినా దేశ చట్టాలకు లోబడే పనిచేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా యాజమాన్యాలు మనదేశ చట్టాలను అంగీకరించాయి. అయితే ట్విట్టర్ మాత్రం అంతిమంగా తమ విధానాలే తమకు ముఖ్యమని వాదిస్తోంది.
ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్ధాయిసంఘంతో ట్విట్టర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన భేటీలో ట్విట్టర్ ప్రతినిధులు తమ వాదనకే కట్టుబడున్నట్లు సమాచారం. ఒకవైపు భారతీయ చట్టాలను తాము గౌరవిస్తామని చెబుతునే మరోవైపు అంతిమంగా తమ విదానాలే తమకు ముఖ్యమని కూడా చెప్పటమే విచిత్రంగా ఉంది.
ట్విట్టర్ ప్రతినిధుల సమాధానాలను విశ్లేషించిన సంఘంలోని ఎంపిలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. భారత్ చట్టాలంటే ట్వట్టర్ ప్రతినిధులు లెక్కలేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. భారత్ లో ట్విట్టర్ కంటిన్యు అవ్వాలంటే ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాల్సిందే అన్న విషయాన్ని పార్టీలకు అతీతంగా సంఘంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా తేల్చిచెప్పారు.
సంఘంలోని సభ్యులు ఇంత గట్టిగా హెచ్చరించినా ట్విట్టర్ ప్రతినిధులు మాత్రం తమ వాదనకే కట్టుబడున్నారట. దాంతో సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల స్ధాయి, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళకున్న అధికారాలను రాతమూలకంగా తెలియజేయాలని ఆదేశించింది. సంఘం అడిగిన చాలా ప్రశ్నలకు ట్విట్టర్ డొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చిందట. ట్విట్టర్ ప్రతినిధుల వరస చూస్తుంటే కేంద్రప్రభుత్వంతో ఢీ కొనటానికే రెడీ అయినట్లు అనుమానంగా ఉంది. మరి ఇదే నిజమైతే కేంద్రాన్ని కాదని ట్విట్టర్ భారత్ లో మనగలదా ?
This post was last modified on June 19, 2021 7:48 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…