బీజేపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతున్నట్లుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై పట్టణంలో బీజేపీ నేతలు నానా గోల చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రొద్దుటూరులో ఆందోళనలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. దాంతో లోకల్ కమలం నేతలు నానా గోల చేశారు.
ప్రొద్దుటూరులో అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు పెట్టాలని అనుకున్నారనే విషయమై పెద్దగా సమాచారం లేదు. అయితే స్దానికంగా ఉండే ముస్లిం నేతల కోరిక కారణంగానే విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ అధికారులతో మాట్లాడినట్లు ప్రచారంలో ఉంది. దీన్నే బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, హిందు వ్యతిరేకంటు నినాదాలతో గోల గోల చేశారు.
నిజానికి చారిత్రక ఆధారాల ప్రకారం మైసూరును పరిపాలించిన టిప్పుసుల్తాన్ బ్రిటీషు వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలే చేశారు. ప్రత్యేకించి హిందువులను వేధించినట్లు కానీ లేకపోతే భరతమాతకు ద్రోహం చేసినట్లు కానీ లేదు. ఈ కారణాలతోనే మైసూరు, బెంగుళూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
ఒకవైపు కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తుంటే ఏపిలో బీజేపీ నేతలు మాత్రం సుల్తాన్ను దేశద్రోహని, హిందు వ్యతిరేకంగా గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదో కారణంతో గోల చేయటం ద్వారా బీజేపీ ప్రజల దృష్టిని ఆకర్షించాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుంది.
నిజమే... టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన షిసెడో…
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి…
దురంధర్ రాకముందు స్పై యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నారు. ముఖ్యంగా…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద…
రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇచ్చిన ఫ్యామిలీ దర్శకుడు…