Political News

బీజేపీ ఓవర్ యాక్షన్

బీజేపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతున్నట్లుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై పట్టణంలో బీజేపీ నేతలు నానా గోల చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రొద్దుటూరులో ఆందోళనలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. దాంతో లోకల్ కమలం నేతలు నానా గోల చేశారు.

ప్రొద్దుటూరులో అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు పెట్టాలని అనుకున్నారనే విషయమై పెద్దగా సమాచారం లేదు. అయితే స్దానికంగా ఉండే ముస్లిం నేతల కోరిక కారణంగానే విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ అధికారులతో మాట్లాడినట్లు ప్రచారంలో ఉంది. దీన్నే బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, హిందు వ్యతిరేకంటు నినాదాలతో గోల గోల చేశారు.

నిజానికి చారిత్రక ఆధారాల ప్రకారం మైసూరును పరిపాలించిన టిప్పుసుల్తాన్ బ్రిటీషు వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలే చేశారు. ప్రత్యేకించి హిందువులను వేధించినట్లు కానీ లేకపోతే భరతమాతకు ద్రోహం చేసినట్లు కానీ లేదు. ఈ కారణాలతోనే మైసూరు, బెంగుళూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నాయి.

ఒకవైపు కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తుంటే ఏపిలో బీజేపీ నేతలు మాత్రం సుల్తాన్ను దేశద్రోహని, హిందు వ్యతిరేకంగా గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదో కారణంతో గోల చేయటం ద్వారా బీజేపీ ప్రజల దృష్టిని ఆకర్షించాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుంది.

This post was last modified on June 19, 2021 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమ్ముడితో హిట్టు కొడితే అన్నయ్యతో పక్కా

ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…

32 minutes ago

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

1 hour ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

2 hours ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

3 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

5 hours ago