బీజేపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతున్నట్లుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై పట్టణంలో బీజేపీ నేతలు నానా గోల చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రొద్దుటూరులో ఆందోళనలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. దాంతో లోకల్ కమలం నేతలు నానా గోల చేశారు.
ప్రొద్దుటూరులో అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు పెట్టాలని అనుకున్నారనే విషయమై పెద్దగా సమాచారం లేదు. అయితే స్దానికంగా ఉండే ముస్లిం నేతల కోరిక కారణంగానే విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ అధికారులతో మాట్లాడినట్లు ప్రచారంలో ఉంది. దీన్నే బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, హిందు వ్యతిరేకంటు నినాదాలతో గోల గోల చేశారు.
నిజానికి చారిత్రక ఆధారాల ప్రకారం మైసూరును పరిపాలించిన టిప్పుసుల్తాన్ బ్రిటీషు వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలే చేశారు. ప్రత్యేకించి హిందువులను వేధించినట్లు కానీ లేకపోతే భరతమాతకు ద్రోహం చేసినట్లు కానీ లేదు. ఈ కారణాలతోనే మైసూరు, బెంగుళూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
ఒకవైపు కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తుంటే ఏపిలో బీజేపీ నేతలు మాత్రం సుల్తాన్ను దేశద్రోహని, హిందు వ్యతిరేకంగా గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదో కారణంతో గోల చేయటం ద్వారా బీజేపీ ప్రజల దృష్టిని ఆకర్షించాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుంది.
This post was last modified on June 19, 2021 3:49 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…