ఒకటికి మించి మరొకటి అన్నట్లుగా ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న విషయాలకు అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం చికాకుకు గురి చేస్తోంది. ఇది సరిపోదున్నట్లుగా ఇటీవల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ హడావుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దీని వెనుక ఉన్నదెవరు? ఉన్నట్లుండి కుప్పంలోనే ఎన్టీఆర్ జపం ఎందుకు మొదలైంది? అసలేం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ 40 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలీ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై బాబు లోతైన అధ్యయనం చేస్తున్నారని చెబుతున్నారు. ఆపరేషన్ కుప్పం ఇప్పుడు కొత్తది కాకున్నా.. ఎన్టీఆర్ ను తెర మీదకు తీసుకురావటంతో ఆయన ఉలిక్కి పడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇలా చేస్తున్నారా? లేదంటే రాజకీయ ప్రత్యర్థులు కొందరు స్థానిక నేతల్ని తమవైపు తిప్పుకొని.. ఇలా చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒక టీంను ఏర్పాటు చేసి.. ఎన్టీఆర్ హడావుడి వెనుక ఉన్నదెవరన్నది తేల్చాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా సొంత నియోజకవర్గంలోనే తనకు ఎదురైన షాకింగ్ పరిణామం ఆయన్ను కొత్త టెన్షన్ కు గురి చేస్తోందని చెబుతున్నారు.
This post was last modified on June 18, 2021 10:20 am
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…