ఒకటికి మించి మరొకటి అన్నట్లుగా ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న విషయాలకు అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం చికాకుకు గురి చేస్తోంది. ఇది సరిపోదున్నట్లుగా ఇటీవల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ హడావుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దీని వెనుక ఉన్నదెవరు? ఉన్నట్లుండి కుప్పంలోనే ఎన్టీఆర్ జపం ఎందుకు మొదలైంది? అసలేం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ 40 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలీ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై బాబు లోతైన అధ్యయనం చేస్తున్నారని చెబుతున్నారు. ఆపరేషన్ కుప్పం ఇప్పుడు కొత్తది కాకున్నా.. ఎన్టీఆర్ ను తెర మీదకు తీసుకురావటంతో ఆయన ఉలిక్కి పడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇలా చేస్తున్నారా? లేదంటే రాజకీయ ప్రత్యర్థులు కొందరు స్థానిక నేతల్ని తమవైపు తిప్పుకొని.. ఇలా చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒక టీంను ఏర్పాటు చేసి.. ఎన్టీఆర్ హడావుడి వెనుక ఉన్నదెవరన్నది తేల్చాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా సొంత నియోజకవర్గంలోనే తనకు ఎదురైన షాకింగ్ పరిణామం ఆయన్ను కొత్త టెన్షన్ కు గురి చేస్తోందని చెబుతున్నారు.
This post was last modified on June 18, 2021 10:20 am
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…