బీజేపీ నేత పెద్దిరెడ్డి మాటలు విన్నవారంతా మరీ ఓవర్ యాక్షన్ పనికిరాదంటున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇస్తే పోటీకి రెడీ అని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఈటల రాజేందరే కాదు కేసీయార్ వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పటం ఓవర్ గానే అనిపించింది. పైగా తనను సంప్రదించకుండానే ఈటలను పార్టీలోకి చేర్చుకోవటం ఏమిటంటు మండిపడ్డారు.
చాలాకాలం తర్వాత మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపైన పార్టీలో చర్చ జరుగుతోంది. టికెట్ మీద హామీ తీసుకోకుండానే ఈటల బీజేపీలోకి చేరేంత అమాయకుడు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లో తనకే టికెట్ ఇచ్చే హామీని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ నాయకత్వం నుండి కూడా ఈటల హామీ తీసుకున్నారు. ఆ తర్వాతే ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇంతచిన్న విషయం కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డికి తెలీకుండానే ఉంటుందా ? అసలు పెద్దిరెడ్డి బీజేపీలో చేరిందే ఏదో గట్టి హామీ తీసుకునే కదా. కాకపోతే మాజీమంత్రిగా, సిట్టింగ్ ఎంఎల్ఏగా ఈటల పార్టీలో చేరారు కాబట్టి కమలం అగ్రనేతలు పెద్దిరెడ్డికన్నా ఈటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం సహజమే. కాబట్టి రేపటి ఉపఎన్నికలో ఈటలను కాదని ఇంకోరికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశమే లేదు.
ఇక తనను సంప్రదించకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డిని ఎవరు సంప్రదిస్తారు ? ఎందుకు సంప్రదించాలి. ఎప్పుడో 1994, 99 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ గెలవలేదు. పెద్దిరెడ్డేమో అవుట్ డేటెడ్ అయితే ఈటలేమో లేటస్టని అర్ధమైపోతోంది. కాబట్టి ఈటలను పార్టీలో చేర్చుకోవటంలో పెద్దిరెడ్డి పర్మిషన్ అవసరమా ? ఏదేమైనా పెద్దిరెడ్డి మాటలు విన్న తర్వాత చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లే అనిపిస్తోంది.
This post was last modified on June 17, 2021 12:29 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…